Site icon HashtagU Telugu

Kota Srinivasa Rao: ప్రముఖ నటుడు కోట శ్రీనివాస‌రావు క‌న్నుమూత‌.. 750కి పైగా చిత్రాల్లో న‌ట‌న‌!

Kota Srinivasa Rao

Kota Srinivasa Rao

Kota Srinivasa Rao: ప్రముఖ తెలుగు నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) ఆదివారం తెల్ల‌వారుజామున క‌న్నుమూశారు. ఆయ‌న మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటును మిగిల్చింది. 1942 జులై 10న కృష్ణాజిల్లా కంకిపాడులో జన్మించిన ఆయన, తన నటనా ప్రతిభతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త సినీ అభిమానులను, సహనటులను శోకసంద్రంలో మునిగిపోయారు.

కోట శ్రీనివాసరావు 1978లో ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత నాలుగు దశాబ్దాలకు పైగా 750కి పైగా చిత్రాల్లో నటించి, తన విశిష్ట నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. హాస్యం, విలన్‌ పాత్రలు, సహాయక పాత్రలు లేదా సీరియస్ రోల్స్‌లోనైనా ఆయన తనదైన శైలితో ప్రతి పాత్రకు జీవం పోశారు. ‘సాగర సంగమం’, ‘మనీ’, ‘ఆ నలుగురు’, ‘గబ్బర్ సింగ్’ వంటి చిత్రాల్లో ఆయన నటన అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన సహజమైన నటన, డైలాగ్ డెలివరీ, శరీర భాష ప్రతి సన్నివేశంలోనూ ప్రత్యేకతను చాటాయి. తెలుగుతో పాటు తమిళం, కన్నడ చిత్రాల్లోనూ నటించి, బహుముఖ నటుడిగా గుర్తింపు పొందారు.

Also Read: CM Revanth Reddy: అందుకే స్థానిక ఎన్నికలు వాయిదా వేశాం: CM రేవంత్

సినిమాలతో పాటు, కోట శ్రీనివాసరావు రాజకీయ రంగంలోనూ తన ముద్ర వేశారు. 1999-2004 మధ్య విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ (BJP) ఎమ్మెల్యేగా సేవలందించారు. రాజకీయ నాయకుడిగా ప్రజలకు సేవ చేయాలన్న ఆయన నిబద్ధత ఆయన వ్యక్తిత్వంలోని మరో కోణాన్ని చాటింది. సినిమా, రాజకీయ రంగాల్లోనే కాక, వ్యక్తిగత జీవితంలోనూ ఆయన సరళత, నీతి నిజాయతీలకు పేరుగాంచారు.

కోట శ్రీనివాసరావు మరణంతో తెలుగు సినీ రంగం ఒక గొప్ప నటుడిని కోల్పోయింది. ఆయన చిత్రాలు, నటనా కౌశలం రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని అభిమానులు కోరుతున్నారు.