Venu Swamy: విజయ్-త్రిషపై వేణుస్వామి షాకింగ్ కామెంట్స్

సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి, తాజాగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల రాజకీయ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పడినా అది నిలవదని, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం సాధించినా రాష్ట్రపతి పాలన వస్తుందని జోస్యం చెప్పారు. గ్రహ సంచారాల ఆధారంగా దేశంలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయని ఆయన పేర్కొన్నారు.   View this post on Instagram   A post […]

Published By: HashtagU Telugu Desk
Venu Swamy Prediction on Vijay

Venu Swamy Prediction on Vijay

సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి, తాజాగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల రాజకీయ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పడినా అది నిలవదని, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం సాధించినా రాష్ట్రపతి పాలన వస్తుందని జోస్యం చెప్పారు. గ్రహ సంచారాల ఆధారంగా దేశంలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయని ఆయన పేర్కొన్నారు.

తమిళనాడులో రాజకీయ అస్థిరత
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడినప్పటికీ, అది ఎక్కువ కాలం నిలవదని వేణుస్వామి స్పష్టం చేశారు. రాష్ట్ర జాతక రీత్యా, గురువు మార్పు కారణంగా రాజకీయ అస్థిరత ఏర్పడుతుందని తెలిపారు. నెల, ఆరు నెలలు లేదా ఏడాదిలోపు రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు రావడం ఖాయమని అన్నారు. విజయ్, త్రిషలది ఏకనాడి కాంబినేషన్ అని, ఈ వ్యవహారంలో త్రిష పాత్ర లేకపోయి ఉంటే రాజకీయ ఫలితం మరోలా ఉండేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన సూచనలు
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఘన విజయం సాధించినప్పటికీ, అక్కడ రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వేణుస్వామి తెలిపారు. మమతా బెనర్జీ జాతక రీత్యా ఆమె తిరిగి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేవని, 2027 సెప్టెంబర్ వరకు ఆమెకు అష్టమ శని నడుస్తుండటమే దీనికి కారణమని వివరించారు. బెంగాల్ రాష్ట్ర జాతకం ప్రకారం కూడా అర్ధాష్టమ శని ప్రభావంతో మత కల్లోలాలు, తీవ్రవాద చర్యలు, హింసాత్మక ఘటనలు పెరిగి రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని అంచనా వేశారు.

గురువు అతిచారంతో సంచలనాలు
మే 25 నుంచి జూన్ 2 మధ్య గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి అతిచారం (గ్రహం ఒక రాశి నుంచి మరో రాశిలోకి వేగంగా చేరడం) చేయనుండటంతో ఈ పెను సంచలనాలు చోటుచేసుకుంటాయని వేణుస్వామి తెలిపారు. ఈ గ్రహ మార్పుల ప్రభావం దేశ రాజకీయాలపై తీవ్రంగా ఉంటుందని ఆయన విశ్లేషించారు.

ఇదే సమయంలో దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు, ఢిల్లీలో తీవ్రవాద దాడులు, భూకంపాలు, విమాన ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ఒక విమాన ప్రమాదంలో సినీ, రాజకీయ రంగాలకు చెందిన కీలక వ్యక్తి మరణిస్తారని చెప్పడం కలకలం రేపుతోంది. తెలంగాణలోనూ రాజకీయ సంచలనాలు తప్పవని, కొందరు ప్రముఖులు జైలుకు వెళ‌తారని, ప్రపంచ స్థాయిలో ఓ ముఖ్యమైన వ్యక్తి మరణించే అవకాశం ఉందని కూడా ఆయన జోస్యం చెప్పారు.

  Last Updated: 09 May 2026, 03:05 PM IST