Varun–Lavanya: హిమాచల్ ప్రదేశ్ వెకేషన్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న మెగా జోడి.. ఫోటోస్ వైరల్!

  • Written By:
  • Publish Date - March 26, 2024 / 09:20 AM IST

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్ గత ఏడాది నవంబర్ లో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్లు వేసి ఇద్దరూ ఏకమయ్యారు. అయితే పెళ్లికి ముందే కొన్ని సంవత్సరాల పాటు సీక్రెట్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తూ వచ్చిన లావణ్య, వరుణ్ తేజ్ లు ఎట్టకేలకు గత ఏడాది మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. పెళ్లి తర్వాత చాలా రోజుల పాటు సినిమా షూటింగులకు దూరంగా ఉన్న వరుణ్, లావణ్యలు మళ్లీ ప్రొఫెషనల్‌ లైఫ్ లో బిజీ కానున్నారు.

అయితే ఇప్పటికే వరుణ్ తేజ్ సినిమాలను లైన్లో పెట్టారు. లావణ్య కూడా వెబ్ సిరీస్ లు, సినిమాలలో అవకాశాలు వస్తే నటించడానికి సిద్ధంగా ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ జంటకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేయడంతో పాటు ఆ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ ఫోటోలో ఏముంది అన్న విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ జంట హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నారు. గత వారం రోజుల నుంచి అక్కడే ప్రకృతి అందాలు మధ్య గడుపుతూ వస్తున్నారు.

పర్వతాలు అధిరోహించి సూర్యా స్తమయం చూస్తూ కపుల్ గోల్స్ ని పర్ఫెక్ట్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను వరుణ్, లావణ్య తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఆ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో క్యూట్ కపుల్, సూపర్ జోడి, ఫొటోస్ అదుర్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఇకపోతే వరుణ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే.. వరుణ్ చివరగా ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో ప్రేక్షకులను పాలకరించారు. రియల్ ఇన్సిడెంట్స్ తో వచ్చిన ఈ చిత్రం విమర్శల ప్రశంసలు అందుకుందే గాని, కమర్షియల్ గా పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు. ప్రస్తుతం వరుణ్ మట్కా అనే మూవీ చేస్తున్నారు.