Tollywood @ 75: త్యాగధనులను స్మరించిన తారలు

75 వ స్వాతంత్ర్య దినోత్సవం వాడవాడలా ఘనంగా జరుగుతోంది.

Published By: HashtagU Telugu Desk
Tollywood

Tollywood

75 వ స్వాతంత్ర్య దినోత్సవం వాడవాడలా ఘనంగా జరుగుతోంది. అంతటా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి, మహేశ్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీ ఇండిపెండెన్స్ డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. చిరంజీవి తన ఇంటి ముందు జాతీయ జెండాను ఎగుర వేసి సెల్యూట్ చేశారు. భారతీయులకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ఇక మహేశ్ బాబు తన కూతురు సితారతో కలిసి జాతీయ జెండాను ప్రదర్శించారు. వన్ నేషన్.. వన్ ఐడెంటిటీ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.  సంతోషం, గర్వం, హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటూ విజయ్ దేవరకొండ నేషనల్ ఫ్లాగ్ కు వందనం చేశారు.

  Last Updated: 15 Aug 2022, 02:42 PM IST