Sharwanand Marriage: రూమర్స్ కు చెక్.. జూన్3న శర్వానంద్, రక్షిత పెళ్లి!

టాలీవుడ్ హీరో శర్వానంద్, రక్షిత పెళ్లి జూన్ 3న జరుగబోతోంది. రెండు రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి.

  • Written By:
  • Publish Date - May 17, 2023 / 12:30 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, రక్షిత జనవరి 26న సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుకకు పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. రెండు కుటుంబాలు పెళ్లి తేదీలను కూడా నిర్ణయించుకున్నాయి. జైపూర్‌లో  రెండు రోజుల పాటు శర్వానంద్, రక్షితల పెళ్లి  గ్రాండ్‌గా జరగనుంది. జూన్ 2న లీలా ప్యాలెస్‌లో మెహందీ ఫంక్షన్ జరగనుండగా, జూన్ 3న ఈ జంట పెళ్లి జరగనుంది. ప్రీ వెడ్డింగ్, అలాగే పెళ్లికి అనేక మంది ప్రముఖులు హాజరుకానున్నారు. బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుకను కన్నుల పండవగా జరుపనున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూధన్ రెడ్డి కుమార్తె రక్షితా రెడ్డితో శర్వానంద్ కొన్ని నెలల క్రితం నిశ్చితార్థం చేసుకున్న సంగతి విదితమే. శర్వానంద్ , రక్షితా రెడ్డి ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారని సోషల్ మీడియాలో వార్త వైరల్ అయ్యింది. దీంతో అభిమానులు సైతం చాలా బాధపడ్డారు. అయితే ఎంగేజ్‌మెంట్ జరిగి 5 నెలలు గడుస్తున్నా.. పెళ్లి పీటలు ఎక్కకపోవడంతో నిశ్చితార్థం క్యాన్సిల్ అంటూ వార్తలు వినిపించాయి. అయితే దీనిపై శర్వానంద్ టీమ్ స్పందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. ‘ ఇక శర్వా,రక్షితా  కుటుంబ సభ్యలు కూడా పెళ్లి క్యాన్సిల్ కాలేదంటూ ఏకంగా డేట్ ను ఫిక్స్ చేశారు.

Also Read: Karnataka CM Race: ఎడతెగని ‘కర్ణాటక’ పంచాయితీ, డైలమాలో కాంగ్రెస్ హైకమాండ్!