Comedians: ఒకే చోటు కలుసుకున్న ముగ్గురు స్టార్ కమెడియన్లు.. నెట్టింట ఫోటో వైరల్?

మామూలుగా సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోలు లేదా హీరోయిన్లు కమెడియన్లు కలుసుకోవడం అన్నది చాలా అరుదు. ఒకే వేదికపై ఒకే స్థలంలో ఇద్దరు ముగ్గు

  • Written By:
  • Publish Date - February 12, 2024 / 06:00 PM IST

మామూలుగా సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోలు లేదా హీరోయిన్లు కమెడియన్లు కలుసుకోవడం అన్నది చాలా అరుదు. ఒకే వేదికపై ఒకే స్థలంలో ఇద్దరు ముగ్గురు హీరోలు ఇద్దరు ముగ్గురు కమెడియన్లు కలుసుకోవడం అన్నవి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. హీరోయిన్ల సంగతి పక్కన పెడితే స్టార్ హీరోలు ఒకే వేదికపై ఒకే ప్లేస్ లో కలిసి కనిపించారు అంటే చాలు అభిమానులకు పండగే అని చెప్పవచ్చు. తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటోను చూసి అభిమానులు కూడా అదే విధంగా పండుగ చేసుకుంటున్నారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆ ఫోటోలో ముగ్గురు స్టార్ కమెడియన్లు కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ కమెడియన్లు మరెవరో కాదు సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, ఆలీ. ఈ ముగ్గురు తాజాగా ఒకచోట కలుసుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలా ముగ్గురు స్టార్ కమెడియన్లు ఒకే చోట కలుసుకోవడం అన్నది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. దాంతో ఆ ఫోటోలను చూసినా అభిమానులు కామెంట్ల వర్షం కురిపించడంతో పాటు కన్నుల పండుగగా ఉంది. చూడటానికి రెండు కళ్ళు చాలడం లేదు. ఇది చాలా రేర్ పిక్చర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా ప్రస్తుతం కోటశ్రీనివాసరావు వయసు పెరగడంతో సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇక బ్రహ్మానందం కూడా అప్పుడప్పుడు మాత్రమే సినిమాల్లో కనిపిస్తున్నారు. ఆ మధ్య మన బ్రహ్మానందం ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఈ మధ్యకాలంలో చాలా తక్కువగా సినిమాలు చేస్తున్నారు. అలీ మాత్రం సినిమాలు, షోలతో ఇంకా అలరిస్తున్నారు. గతంలో ఈ ముగ్గురు కలిసి ఎన్నో వందల సినిమాల్లో నటించి ప్రేక్షకులని మెప్పించారు. కోట – బ్రహ్మానందం, బ్రహ్మానందం – అలీ కాంబినేషన్స్ ఎన్నో సినిమాల్లో నవ్వులు పూయించాయి. తాజాగా ఈ ముగ్గురు కలవగా కోటశ్రీనివాసరావు కుర్చీలో కూర్చొని ఉండగా అటు ఇటు బ్రహ్మానందం, అలీ నిలబడి ఫొటో దిగారు. ఈ ముగ్గురు తమ పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ గడిపారు.