Kalki: ప్రభాస్ కల్కిపై అంచనాలు పెంచేసిన స్వప్న దత్.. కామెంట్స్ వైరల్?

  • Written By:
  • Publish Date - March 23, 2024 / 06:10 PM IST

టాలీవుడ్ హీరో పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే ఇటీవలే సలార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. అడ్వెంచర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీ కోసం ఇండియా మొత్తం వెయిట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ మూవీకి షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటివారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా డార్లింగ్ ప్రభాస్ సలార్ తర్వాత త్వరలో మే 9న కల్కి 2898AD సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని అర్ధమవుతోంది. కల్కి 2898 నుంచి వస్తున్న ఒక్కో అప్డేట్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. తాజాగా అశ్విని దత్ కుమార్తె స్వప్న దత్ కల్కి చిత్రంపై ఇంకాస్త అంచనాలు పెంచేసింది.

హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్ వేడుక వైభవంగా జరిగింది. ఈ వేడుకలో స్వప్న దత్.. ప్రభాస్ కల్కి చిత్రం గురించి మాట్లాడారు. ఈ సందర్బంగా స్వప్న దత్ మాట్లాడుతూ.. ప్రభాస్ పోషిస్తున్న భైరవ పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో చాలా కాలం ఉండిపోతుంది. ఈ చిత్రం సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుంది. అయితే మే 9న ఈ చిత్రం రిలీజ్ అవుతుందా కాదా అనే అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు తొలగిస్తూ కల్కి చిత్రం మే 9 రిలీజ్ కి రైట్ ట్రాక్ లో సిద్ధం అవుతోంది అని స్వప్న క్లారిటీ ఇచ్చింది స్వప్న దత్. ఈ వార్తలు వైరల్ అవ్వడంతో ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాపై మరింత అంచనాలను పెట్టుకున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.