South Heroines : బాలీవుడ్ లో బిజీ అవుతున్న సౌత్ హీరోయిన్స్..

మన సౌత్ హీరోయిన్స్ కూడా బాలీవుడ్ లో హవా నడిపిస్తున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ నుంచి హీరోయిన్స్ ని తెచ్చుకొని ఇక్కడ సినిమాలు తీసి గొప్పగా చెప్పుకునే వారు. కానీ ఇప్పుడు మన హీరోయిన్స్ బాలీవుడ్ లో బిజీ అవుతున్నారు.

  • Written By:
  • Publish Date - May 19, 2023 / 07:00 AM IST

ఇటీవల మన సౌత్(South) సినిమాల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. మన సినిమాలు ఇక్కడే కాక బాలీవుడ్(Bollywood) లో కూడా భారీ హిట్స్ కొట్టి కలెక్షన్స్ కూడా సాధిస్తున్నాయి. మన సౌత్ సినిమాలను తీసుకొని రీమేక్స్ చేసుకుంటున్నారు. కొంతమంది అయితే మన సౌత్ స్టార్స్ ని కూడా తమ సినిమాల్లో భాగం చేసుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే విజయ్ సేతుపతి, జగపతి బాబు.. పలువురు నటీనటులు బాలీవుడ్ లో బిజీ అవుతున్నారు. రామ్ చరణ్(Ram Charan), ఎన్టీఆర్(NTR), అల్లు అర్జున్(Allu Arjun) లను కూడా గెస్ట్ అప్పీరెన్స్ లకు ఒప్పించాలని చూస్తున్నారు.

ఇక మన సౌత్ హీరోయిన్స్ కూడా బాలీవుడ్ లో హవా నడిపిస్తున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ నుంచి హీరోయిన్స్ ని తెచ్చుకొని ఇక్కడ సినిమాలు తీసి గొప్పగా చెప్పుకునే వారు. కానీ ఇప్పుడు మన హీరోయిన్స్ బాలీవుడ్ లో బిజీ అవుతున్నారు. ఇటీవల కాలంలో సమంత, రష్మిక, పూజా హెగ్డే బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్నారు. ఇక త్వరలో నయనతార కూడా బిజీ అవ్వబోతుంది.

సమంత ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో నార్త్ ప్రేక్షకులని మెప్పించింది. ఆ సిరీస్ తర్వాత ఇప్పుడు సమంత చేతిలో ఓ బాలీవుడ్ సినిమాతో పాటు సిటాడెల్ సిరీస్ కూడా ఉన్నాయి. ఈ రెండిట్లో ఏ ఒక్కటి రిలీజయిన సమంతకు మరిన్ని బాలీవుడ్ ఆఫర్స్ రావడం ఖాయం. సమంత కూడా ఈ మధ్య సౌత్ ని వదిలేసి బాలీవుడ్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తుంది. శాకుంతలం సినిమాను కూడా బాలీవుడ్ లో గ్రాండ్ గా ప్రమోట్ చేసింది. రేపు ఖుషి సినిమా కూడా హిందీలో రిలీజ్ చేయబోతుంది.

పూజా హెగ్డే మొదట బాలీవుడ్ తో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత సౌత్ లో స్టార్ అయినా ఇప్పుడు బాలీవుడ్ లో అవకాశాలు వరుసగా వస్తున్నాయి. హౌస్ ఫుల్ 4, రాధేశ్యామ్, సర్కస్, రీసెంట్ గా కిసీ కా భాయ్ కిసీ కి జాన్.. ఇలా వరుసగా హిందీ సినిమాల్లో నటించినా అవన్నీ ఫ్లాప్స్ అయ్యాయి. అయినా కూడా ఈ అమ్మడికి బాలీవుడ్ లో అవకాశాలు తగ్గలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక సినిమా ఉంది, మరిన్ని సినిమా కథలు వింటోంది ఈ బుట్టబొమ్మ.

ఇక రష్మిక అయితే సౌత్ లో స్టార్ డం మైంటైన్ చేస్తూనే బాలీవుడ్ లో కూడా దూసుకుపోతుంది. బాలీవుడ్ లో గుడ్ బై సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఆ ఆతర్వాత మిషన్ మజ్నుతో పలకరించింది. ఈ రెండు సినిమాలు పరాజయం పాలయ్యాయి. కానీ సౌత్ నుంచి వెళ్లిన పుష్ప సినిమా అక్కడ భారీ విజయం సాధించింది. ఇప్పుడు పుష్ప 2, రణబీర్ కపూర్ సరసన యానిమల్, మరో రెండు బాలీవుడ్ సినిమాలు కూడా రష్మిక చేతిలో ఉన్నాయి. ఇక యాడ్స్ అయితే వరుసగా చేస్తోంది నేషనల్ క్రష్.

సౌత్ లో ఇన్నాళ్లు లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్న నయనతార ఇన్నాళ్ల తర్వాత జవాన్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. నయన్ ఒప్పుకుంటే వరుసగా సినిమాలు చేసేందుకు బాలీవుడ్ డైరెక్టర్స్, నిర్మాతలు రెడీగా ఉన్నారట. ఫ్యూచర్ లో నయన్ కూడా బాలీవుడ్ లో బాగా బిజీ అవుతుంది అంటున్నారు. ఇక వీళ్ళే కాకుండా మరింతమంది సౌత్ హీరోయిన్స్ ని తీసుకోవడానికి బాలీవుడ్ మొగ్గు చూపుతోంది.

ఇక నార్త్ నుంచి వచ్చి సౌత్ లో స్టార్స్ అయినా తమన్నా, రకుల్, రాశి ఖన్నా.. లాంటి వాళ్ళు అయితే ఇక్కడ స్టార్స్ అయ్యాక బాలీవుడ్ కి చెక్కేసి అక్కడ వరుస సినిమాలు చేస్తున్నారు.

 

Also Read :  Balagam : టీవీలో కూడా అదరగొట్టిన బలగం.. స్టార్ హీరోల సినిమాలను దాటి టీఆర్పీ..