Samantha :నా దయను బలహీనతగా భావించకండి..సమంత ట్వీట్ వైరల్..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత... సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన పర్సనల్ లైఫ్ గురించి సామ్...ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది.

  • Written By:
  • Publish Date - April 23, 2022 / 12:47 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత… సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన పర్సనల్ లైఫ్ గురించి సామ్…ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది. అయితే సమంత…ఇప్పుడో ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.నా నిశబ్దాన్ని అమాయకత్వంగా..నా శాంతాన్ని అంగీకరంగా..నా దయను బలహీనతగా భావించకండి..పొరపాటు పడకండి. ఎందుకంటే దయకు కూడా కాలం చెల్లుతుంది…లేటెస్ట్ అప్ డేట్స్ ఉంటాయి అంటూ ట్వీట్ చేసింది.

దీంతో సామ్ చేసిన ఈ ట్వీట్ ఎవర్ని ఉద్దేశించి చేసిందన్న చర్చ మొదలైంది. శివ నిర్వాణ్ డైరెక్షన్ లో సమంత, విజయ్ దేవరకొండ జంట మొదలుకాబోతున్న ఓ మూవీకి గురువారం హైదరాబాద్ లో పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సమంత హాజరుకాలేదు. విజయ్ దేవరకొండ మాత్రమే హాజరైనట్లు తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అయితే దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొంత మంది ఫన్నీగా కామెంట్ చేయగా…మరికొందరు వారు ముగ్గురూ రాకపోవడం సరికాదంటూ ట్రోల్ చేస్తున్నారు.

ఇక సమంత, నాగచైతన్య మళ్లీ కలిసేందుకు అఖిల్…సమంతను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు అక్కినేని ఫ్యామిలీ నాగ చైతన్యకు మరో హీరోయిన్ తో పెళ్లి చేయబోతున్నట్లుగా పుకార్లు వస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీన్ని ఉద్దేశించి సమంత ఈ ట్వీట్ చేశారా లేదా సినీ ఇండస్ట్రీలో ఇంకెవరినైనా ఉద్దేశించి చేసిందా…అనేది క్వచ్చన్ మార్క్. ఈ ట్వీట్ పై నెటిజన్లు మాత్రం ఎవరికి తోచినట్లు వారు కామెంట్ చేస్తున్నారు.