Samantha: శాకుంతలం రిజల్ట్ పై స్పందించిన సమంత.. పోస్ట్ వైరల్?

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ

  • Written By:
  • Publish Date - April 18, 2023 / 06:09 PM IST

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలె విడుదలైన విషయం తెలిసిందే. తమిళ నటుడు దేవ్ మోహన్ ఇందులో హీరోగా నటించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించిన విధంగా సక్సెస్ కాలేకపోయింది. అయితే ఈ సినిమా రిజల్ట్ పట్ల అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనుకున్న ఈ సినిమా కనీసం హిట్ టు టాక్ ను కూడా సొంతం చేసుకోకపోవడంతో చిత్ర బృందం కూడా తీవ్ర నిరాశ చెందుతున్నారు.

చిత్ర బృందం కూడా ఈ సినిమా రిజెల్ట్ పై స్పందించడం లేదు. చాలామంది సమంత పై ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా హీరోయిన్ సమంత ఈ సినిమా ఫలితం పై పరోక్షంగా స్పందించింది. అది కూడా భగవద్గీతలోని అద్భుత శ్లోకాన్ని ఉటంకిస్తూ తన ఫొటోను పంచుకున్నారు. తాజాగా సమంత తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక ఫోటోని షేర్ చేసింది. ఆ ఫోటోలో సమంత కారులో కూర్చుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ బయటకు చూస్తూ ఉంది. అందుకు సంబంధించిన ఫోటోని షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది.

 

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన| మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి అనే గీతా శ్లోకాన్ని రాసుకొచ్చింది. కాగా సమంత చేసిన ఆ శ్లోకం అర్థం.. పనిచేయడం వరకు మాత్రమే నీకు అధికారం దాని ఫలితంతో నీకు సంబంధం లేదు.. పని చేసేటప్పుడు ప్రతిఫలం ఆశించి ఏ పని చేయకు అలా చేయడం మానుకో అని అర్థం వచ్చే విధంగా ఆ కొటేషన్ రాసుకొచ్చింది సమంత. సినిమా డిజాస్టర్ కావడంతో సోషల్ మీడియాలో సినిమా రిజల్ట్ పై తనపై వస్తున్న ట్రోల్స్ కి సమంత ఈ విధంగా సమాధానం చెప్పిందని తెలుస్తోంది. ఎవరి కెరీర్‌లో అయిన ఎత్తు పల్లాలు సహజమని అలా అని వాటి గురించే ఆలోచిస్తూ ఉండిపోతే జీవితంలో ముందుకు వెళ్లలేమన్నది సామ్‌ అభిప్రాయం. సమంత సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం హిందీలో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో నటిస్తోంది. అలాగే వీటితోపాటుగా ఒకటి రెండు సినిమాలు ఇంకా చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తోంది.