బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru) ఇంట్లో ఈసారి దీపావళి వేడుకలు హంగామాగా జరిగాయి. ప్రత్యేకంగా ఆ వేడుకల్లో నటీమణి సమంత రూత్ ప్రభు పాల్గొనడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సమంత స్వయంగా రాజ్ కుటుంబ సభ్యులతో కలిసి దీపావళిని సెలబ్రేట్ చేస్తూ, బాణసంచా కాల్చిన ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. “నా మనసు కృతజ్ఞతతో నిండిపోయింది” అంటూ ఆమె పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సామ్ సింపుల్ లుక్లో, సాంప్రదాయ దుస్తుల్లో కనిపించగా, అభిమానులు ఆమె చిరునవ్వుతో మంత్రముగ్ధులయ్యారు.
Minister Lokesh: ట్రిలియన్ డాలర్ ఎకానమీగా విశాఖపట్నం: మంత్రి లోకేష్
రాజ్ నిడిమోరు – డీకే జంట తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మాన్’ ద్వారానే సమంతకు బాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆ సిరీస్లో ఆమె చేసిన రాజీ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు హిందీ ప్రేక్షకుల్లో కూడా ఆమెకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ పెరిగింది. ఆ ప్రాజెక్ట్ తర్వాత సమంత, రాజ్ నిడిమోరా మధ్య స్నేహం మరింత బలపడిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా దీపావళి వేడుకల్లో కూడా ఇద్దరూ కలిసి కనిపించడంతో, వారి బంధం గురించి కొత్త చర్చలు మొదలయ్యాయి.
గత కొంతకాలంగా సమంత – రాజ్ నిడిమోరా మధ్య స్నేహం కంటే ఎక్కువ సంబంధం ఉందా? అనే గాసిప్స్ బాలీవుడ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇరువురు దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. సమంత ప్రస్తుతం సినిమా ప్రాజెక్టుల నుంచి కొంత విరామం తీసుకొని ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు రాజ్ నిడిమోరా తన కొత్త వెబ్ సిరీస్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. దీపావళి సందర్భంగా ఇద్దరూ కలిసి గడిపిన ఈ వేడుక ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.