Rashmika Mandanna : ఆ సినిమా కథ నచ్చకపోయినా చేసిందా.. రష్మిక ఈ కామెంట్స్ అందరు షాక్..!

కన్నడ భామ రష్మిక మందన్న (Rashmika Mandanna) ఇప్పుడు నేషనల్ వైడ్ ట్రెండింగ్ లో ఉంది. రీసెంట్ గా రిలీజైన యానిమల్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న రష్మిక నెక్స్ట్ పుష్ప 2 తో మరోసారి హడావిడి చేయనుంది. దీనితో పాటు రెయిన్ బో, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలు

  • Written By:
  • Publish Date - February 14, 2024 / 08:00 AM IST

కన్నడ భామ రష్మిక మందన్న (Rashmika Mandanna) ఇప్పుడు నేషనల్ వైడ్ ట్రెండింగ్ లో ఉంది. రీసెంట్ గా రిలీజైన యానిమల్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న రష్మిక నెక్స్ట్ పుష్ప 2 తో మరోసారి హడావిడి చేయనుంది. దీనితో పాటు రెయిన్ బో, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలు కూడా ఆమె ఖాతాలో ఉన్నాయి. ఇదిలాఉంటే తన గురించి సోషల్ మీడియా ఎవరు ఏమన్నా సరే వెంటనే రియాక్ట్ అవుతుంది రష్మిక. ఈ క్రమంలో ఓ సినిమా కథ నచ్చకపోయినా సరే రష్మిక ఆ సినిమాలో నటించింది అంటూ ఒక నెటిజెన్ కామెంట్ చేశాడు.

రష్మిక హీరోయిన్ గా శర్వానంద్ హీరోగా నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాను కిశోర్ తిరుమల డైరెక్ట్ చేశారు. అయితే ఈ సినిమా కథ నచ్చకపోయినా డైరెక్టర్ కిశోర్ తిరుమల, హీరో శర్వానంద్ మీద నమ్మకంతోనే రష్మిక ఆ సినిమా చేసిందని కామెంట్ చేశాడు ఒక నెటిజెన్. అయితే దీనికి వెంటనే స్పందించింది రష్మిక తను ఏ సినిమా అయినా కథ నచ్చబట్టే చేస్తానని అసలు ఇలాంటివన్నీ ఎలా పుట్టిస్తారో తెలియదని ఆన్సర్ ఇచ్చింది.

రష్మిక రెస్పాండ్ అయిన తీరు చూస్తుంటే కచ్చితంగా ఆమె ఆ సినిమా నచ్చే చేసిందని తెలుస్తుంది. ప్రస్తుతం రష్మిక ఏ సినిమా చేసినా అది పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకుంటుంది. ఈ ఇయర్ పుష్ప 2 తో మరోసారి అమ్మడు తన సత్తా చాటనుంది. వీటితో పాటుగా రష్మిక ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో కూడా అలరించనుంది.