Rashmika Mandanna: వాలెంటైన్స్ డే సందర్భంగా స్పెషల్ పోస్ట్ చేసిన రష్మిక మందన.. పోస్ట్ వైరల్?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రష్మిక ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపో

  • Written By:
  • Publish Date - February 14, 2024 / 10:00 AM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రష్మిక ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తోంది. అలాగే పలు కమర్షియల్ యాడ్స్ ద్వారా కూడా భారీగా సంపాదిస్తోంది రష్మిక. ఇకపోతే ఇటీవలె ఈమె యానిమల్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ లో పుష్ప 2 సినిమాలో నటిస్తోంది. అలాగే విక్కీ కౌశల్ హీరోగా బాలీవుడ్ లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ పీరియాడిక్ మూవీ చావ మూవీలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక తమిళంలో ధనుష్ సరసన శేఖర్ కముల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. అలాగే రెయిన్ బో, ది గర్ల్ ఫ్రెండ్ అనే రెండు లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా నడుపుతోంది రష్మిక మందన. తెలుగుతో పాటు అన్ని భాషల్లో ఆమె తన సత్తాను చాటుతూ, వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారి స్టార్ హీరోయిన్ లో ఒకరిగా రాణిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో హీరోయిన్ రష్మిక ఒక పోస్ట్ చేసింది. వాలెంటైన్స్ డే సందర్భంగా రష్మిక చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ పోస్టులో ఏముంది అన్న విషయానికి వస్తే..

 

మీతో మాట్లాడి చాలా రోజులు అవుతుంది గాయిస్. నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. ఈరోజు అన్ని మాట్లాడేసుకుందాం.. ఇప్పటివరకు జరిగిన ప్రతి విషయం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, అలాగే మీ వాలెంటైన్స్ డే ప్లాన్స్ కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాను అంటూ ట్వీట్ చేసింది రష్మిక. ఈ ట్వీట్ తో పాటు రెండు క్యూట్ సెల్ఫీలు కూడా షేర్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ వైరల్ గా మారడంతో అభిమానులు రష్మికని ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడంతో పాటు కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు. వాలెంటెన్స్ డే రోజు స్పెషల్ ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.