Ranbir Kapoor : బాలీవుడ్ లో రణ్బీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా రామాయణ కథ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. నితేశ్ తివారీ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. కాగా ఈ మూవీ నుంచి ఇప్పటికే పలు ఫోటోలు నెట్టింట లీకైన సంగతి తెలిసిందే. తాజాగా సాయి పల్లవి, రణ్బీర్ కపూర్ పిక్స్ కూడా లీక్ అయ్యాయి.
ఆ పిక్స్ లో సాయి పల్లవి, రణ్బీర్.. కోటలో ఉన్న సీతారాములుగా కనిపిస్తున్నారు. వారిద్దరి లుక్స్ అయితే నెటిజెన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ పిక్స్ తో మరో విషయం కూడా క్లారిటీ వచ్చేసింది. మొన్నటివరకు సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు అనేది ఒక ప్రశ్నగా మాత్రమే ఉంది. నేడు ఈ ఫొటోలతో సీతగా ఆమె నటిస్తున్నారని క్లారిటీ వచ్చేసింది.
#RanbirKapoor & #SaiPallavi on Sets of #Ramayana 🔥🔥🔥🔥 pic.twitter.com/F1nFw5xJ3F
— BFilmy Official (@BFilmyOfficial) April 27, 2024
కాగా ఈ మూవీ సాయి పల్లవి 50 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది. సాయి పల్లవి ఇప్పటి వరకు ఛార్జ్ చేస్తున్న రెమ్యూనరేషన్ కంటే.. ఇది చాలా ఎక్కువ అనే చెప్పాలి. అయితే ఈ రెమ్యూనరేషన్ మొత్తం మూడు చిత్రాలకు కలిపి అని తెలుస్తుంది. ఈ రామాయణాన్ని మొత్తం మూడు భాగాలుగా చిత్ర యూనిట్ రూపొందిస్తుంది. మొదటి భాగాన్ని వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమా ఇతర కాస్టింగ్ వివరాల విషయానికి వస్తే.. రావణాసురుడిగా యశ్ నటించబోతున్నారట. హనుమంతుడిగా సన్నీ డియోల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ఇద్దరు ఆస్కార్ విన్నర్స్.. ఏ ఆర్ రెహమాన్, హన్స్ జిమ్మెర్ (Hans Zimmer) సంగీతం చేస్తున్నారు.
Also read : Actor Missing : టీవీ నటుడి కిడ్నాప్.. ఐదు రోజులుగా మిస్సింగ్.. ఏమైంది ?