Big Update: స్టార్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ త్వరలోనే ప్రీ-ప్రొడక్షన్లోకి ఎంటర్ కాబోతుంది. రాజమౌళి, అతని తండ్రి విజయేంద్ర వర్మతో సహా అతని రైటింగ్ టీమ్ స్క్రీన్ ప్లే దాదాపు పూర్తి చేసింది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. కథను రెండు భాగాలుగా విభజించాలని రాజమౌళి తీసుకున్న నిర్ణయం ఈ ప్రాజెక్ట్కి ఆసక్తికరమైన ట్విస్ట్ని జోడిస్తుంది. అవును ఈ సినిమాని రెండు భాగాలుగా నిర్మించనున్నారు.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “బాహుబలి” సినిమాలే ఈ ట్రెండ్కి నాంది పలికాయి. అయితే, “RRR” కోసం కథను విభజించలేదు. ప్రస్తుతం మహేశ్ మూవీ కోసం స్క్రిప్ట్ రైటింగ్ ప్రక్రియలో భాగంగా రెండు భాగాలుగా తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యాడు. ఆంగ్ల నవల ఆధారంగా ఈ పేరులేని ఈ చిత్రాన్ని కెఎల్ నారాయణ నిర్మించనున్నారు. సినిమాలో అడ్వాన్స్డ్ విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగించనున్నారు. రాజమౌళి పై ఉన్న ధీమాతో హాలీవుడ్ స్టూడియో ఈ మూవీలో భాగం కావాలని నిర్ణయించుకుంది.
Also Read: Revanth Reddy: కేసీఆర్ శిరచ్ఛేదనం జరగాల్సిందే, బీఆర్ఎస్ ఓడిపోవాల్సిందే: స్టేషన్ ఘన పూర్ సభలో రేవంత్!