బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మూడేళ్ల తర్వాత భారత్ కు వచ్చారు. మంగళవారం ముంబై ఎయిర్ పోర్టులో దిగిన ప్రియాంకకు అభిమానులు ప్లకార్డులతో స్వాగతం పలికారు. భర్త నిక్ జోనాస్, కూతురుతో కలిసి ఆమె వచ్చారు. పెళ్లి తర్వాత భర్తతో కలిసి లాస్ ఏంజెల్స్లో సెటిలైన ఆమె.. దాదాపు మూడేళ్ల తర్వాత ముంబై వచ్చారు.ఈ టూర్ కు సంబంధించిన వివరాలను ప్రియాంక అంతకుముందే ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించారు. బోర్డింగ్ పాస్ కు సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ దాదాపు మూడేళ్ల తర్వాత ఇంటికి వెళుతున్నానంటూ తెలిపారు. గాయకుడు నిక్ జోనాస్ను పెళ్లాడిన ప్రియాంక మూడేళ్ల తర్వాత తొలిసారిగా ఇండియాకు తిరిగి వచ్చింది.
కోవిడ్-19 మహమ్మారి తర్వాత ప్రియాంక దేశానికి రావడం ఇదే తొలిసారి. ప్రియాంక చోప్రా బ్లూ కలర్ దుస్తులలో వైట్ స్నీకర్లతో అందంగా కనిపించింది. ఎయిర్పోర్టు నుంచి బయటకు రాగానే ప్రియాంక ఓ స్నేహితుడిని కౌగిలించుకుని తన కారు వైపు వెళ్లింది. కారులోకి వెళ్లే వరకు ప్రియాంక అభిమానులకు అభివాదం చేస్తూనే ఉంది. ఇంటికి చేరుకున్న తర్వాత ప్రియాంక చోప్రా సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటోను షేర్ చేసింది. కరణ్ జోహార్ చాట్ షో.. కాఫీ విత్ కరణ్ షోను చూస్తున్న పిక్ ను షేర్ చేసింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా రాణించిన ప్రియాంక బేవాచ్ మూవీతో 2017లో హాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో వయసులో తనకంటే పదేళ్లు చిన్నవాడైన ప్రముఖ పాప్ సింగర్ నిక్ జొనాస్తో పరిచయం,అది కాస్త ప్రేమకు దారి తీయడంతో కుటుంబసభ్యుల అంగీకారంతో 2018లో ఈ జంట ఒక్కటయ్యారు. వివాహమైన తర్వాత నుంచి ఆమె తన భర్త నిక్తో కలిసి లాస్ఏంజెల్స్లోనే ఉంటోంది ప్రియాంక చోప్రా.