Jr NTR: ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచిలో జూనియర్ ఎన్టీఆర్ కు సభ్యత్వం లభించింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ కొత్త సభ్యుల ఎంపికలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ను కూడా ఎంపిక చేసింది. ఈ మేరకు ఆయన పేరును అధికారికంగా ప్రకటించింది. ‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ను ఎంపిక చేయడంతో పాటు మరో నలుగురు హాలీవుడ్ నటులకు కూడా ఇందులో స్థానం కల్పించింది. జూనియర్ ఎన్టీఆర్తో పాటు ఈ జాబితాలోకి ఎంపికైనవారిలో కే హుయ్ క్వాన్, మార్షా స్టెఫానీ బ్లేక్, కెర్రీ కాండన్, రోసా సలాజర్ కూడా ఉన్నారు.
తెరపై వారి హావభావాలతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. అద్భుతమైన నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. అలాంటి గొప్ప నటీనటులను యాక్టర్స్ బ్రాంచ్ లోకి ఆహ్వానిస్తున్నాం. ఇలాంటి గొప్ప నటీనటులను బ్రాంచ్లోకి ఆహ్వానించడం థ్రిల్గా ఉంది’ అంటూ అకాడమీ ఈ సందర్భంగా పేర్కొంది. అకాడమీ చేసిన పోస్ట్ను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. జూనియర్ సభ్యత్వం పట్ల అటు అభిమానుల్లో, ఇటు టాలీవుడ్ లో ఆనందం నెలకొంది.
Also Read: TS Polls: ఈసీ కీలక నిర్ణయం, జర్నలిస్టులకూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం