Naveen Polishetty: నవీన్ పొలిశెట్టికి బైక్ యాక్సిడెంట్.. ప్రస్తుత పరిస్థితి ఇదే?

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి గురించి మనందరికీ తెలిసిందే. జాతి రత్నాలు మూవీతో భారీగా పాపులారిటీని సంపాదించుకున్నాడు నవీన్ పొలిశెట్టి.

  • Written By:
  • Updated On - March 28, 2024 / 05:01 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి గురించి మనందరికీ తెలిసిందే. జాతి రత్నాలు మూవీతో భారీగా పాపులారిటీని సంపాదించుకున్నాడు నవీన్ పొలిశెట్టి. ఆ తర్వాత గత ఏడాది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీతో ప్రేక్షకులను పలకరించారు నవీన్ పొలిశెట్టి. ఇందులో అనుష్క హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నవీన్ తన తదుపరి సినిమాలలో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో నవీన్ కి సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ వైరల్ అవ్వడంతో అభిమానుల ఆందోళన చెందుతున్నారు.. అసలేం జరిగిందంటే.. హీరో నవీన్ పొలిశెట్టి కి యాక్సిడెంట్ కు గురైనట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో ఉదయం నుంచి వైరల్ అవుతోంది. అయితే ఈ ప్రమాదం షూటింగ్‏లో జరిగిందా ?లేదా ? అనేది క్లారిటీ తెలియరాలేదు. నవీన్ పొలిశెట్టికి బైక్ యాక్సిడెంట్ జరిగిందని.. చేతికి ఫ్యాక్చర్ కావడంతో వైద్యులు అతడికి రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని తెలుస్తోంది. దీంతో అతడి రాబోయే సినిమా షూటింగ్స్ కు రెండు నెలలు ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై నవీన్ పొలిశెట్టి గానీ తన టీం గానీ రియాక్ట్ కాలేదు.

 

ఇకపోతే నవీన్ సినిమాల విషయానికొస్తే..ప్రస్తుతం ఆయన చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. అలాగే త్వరలోనే తన మూవీ అప్డేట్స్ ఇస్తానంటూ నవీన్ ఇటీవల ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం తన ఇన్ స్టాలో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాకు సంబంధించిన స్టోరీ షేర్ చేశారు నవీన్ పొలిశెట్టి..ఇకపోతే తాజాగా జరిగిన బైక్ యాక్సిడెంట్ లో నవీన్ కి చిన్న దెబ్బలు తగిలాయని కొద్దిరోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో ఉన్నట్టు తెలుస్తోంది.