యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా తారక్ కోసం ప్రాణాలు ఇచ్చేవారు ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. తారక్ అంటే అంత పిచ్చి మరి. అలా తారక్ డైహాడ్ ఫ్యాన్స్ లో ఒక వీరాభిమాని తాజాగా మృతి చెందడంతో అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే మరణించడంతో తారక్ అభిమానులు ఆ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కొప్పిగుంట గ్రామానికి చెందిన శ్యామ్ (Shyam) కుర్రాడికి చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అంటే పిచ్చి.ఎక్కడ ఎన్టీఆర్ కు సంబంధించిన ఈవెంట్ జరిగినా కూడా అక్కడికి వెళ్లేవాడు.అంతేకాకుండా ఆ ఈవెంట్ పనులన్నీ కూడా దగ్గరుండి చూసుకునేవాడు. కొన్ని నెలల క్రితం యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన ధమ్కీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఆ ఫంక్షన్కు కూడా వచ్చాడు శ్యామ్.
ఎన్టీఆర్ వేదిక పై ఉండగానే తన అభిమాన హీరోను గట్టిగా హత్తుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా అప్పట్లో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే.అలా ఎన్టీఆర్ అంటే అంత అభిమానం ఉన్న శ్యామ్ ఊహించని విధంగా చిన్న వయసుకే మృతి చెందాడు. అయితే ఆ యువకుడు ఎలా చనిపోయాడు అన్న వివరాల మాత్రం తెలియడం లేదు. శ్యామ్ కు ఏమైందంటే ఎన్టీఆర్ అభిమానులు రియాక్ట్ అవుతున్నారు. అతని మరణంపై విచారణ జరుపాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Tirumala: ఏడుకొండలస్వామిని దర్శించుకోవడానికి ఏవారం మంచిందంటే!