Jio Cinema : ముకేశ్ అంబానీ ‘జియో సినిమా ఓటీటీని స్టార్ట్ చేసి.. ఐపీఎల్ తో పాటు కొన్ని సినిమాలను ఫ్రీగా చూసే అవకాశం కల్పించిన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం జియో సినిమాస్ యూజర్స్ అంతా ఈ ఆఫర్ ని యాడ్స్ తో ఎంజాయ్ చేస్తున్నారు. అవును ఫ్రీగా సినిమాలు చూసే యూజర్స్ కి యాడ్స్ ఎక్కువుగా వస్తుంటాయి. అయితే ఇప్పుడు ఈ యాడ్స్ ని తొలిగించి కంటిన్యూగా సినిమాలు చూసేలా అంబానీ మామ అవకాశం కల్పిస్తూ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు.
ఇందుకోసం ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఆఫర్ ని యూజర్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ ఆఫర్ లో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మొదటి ఆప్షన్ ఏంటంటే.. నెలకి రూ.29 చెల్లించి యాడ్స్ లేకుండా సినిమాలు మరియు మిగతా కంటెంట్ ని చూడొచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం ఒక డివైస్ కి మాత్రమే వర్తిస్తుంది. ఈ ఆఫర్ వల్ల ఒకే సమయంలో ఒక డివైస్ లోనే చూడగలము. ఇక రెండో ఆప్షన్లో.. నాలుగు డివైస్ లు కలిసి ఒకే సమయంలో చూసేలా అవకాశం కలిపిస్తూ ఆఫర్ ఇచ్చారు.
ఈ ఆఫర్ కోసం నెలకి రూ.89 చెల్లించాల్సి ఉంటుంది. కేవలం 89 చెల్లించి నాలుగు డివైస్ లు ఒకే సమయంలో యాడ్స్ లేకుండా సినిమాలు చూడొచ్చు. అదికూడా 4K క్వాలిటీతో చూసేయొచ్చు. మరి అంబానీ మామ ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్ ని మీరు కూడా ఉపయోగించేసుకోండి. కాగా రానున్న రోజుల్లో జియో నుంచి సూపర్ కంటెంట్ ఆడియన్స్ ముందుకు రానుంది. ప్రస్తుతం క్రేజీ సినిమా అండ్ వెబ్ సిరీస్ ప్రాజెక్ట్స్ అన్ని మేకింగ్ లో ఉన్నాయి.
Just In :
JioCinema announces Gamechanging Premium plans with Ad-free 4K streaming & offline viewing starting only ₹29/month which enables access to HBO/Paramount+/Peacock INTL Content.
Sports & Indian entertainment content will remain free with ads, even without subscription! pic.twitter.com/huicpWTFhU
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) April 25, 2024
Also read : Rajinikanth : ‘కూలీ’ సినిమాకి రజినీకాంత్ అన్ని కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారా..?