Janhvi: హైదరాబాద్ లో జాన్వీ కపూర్ ఖరీదైన ఫ్లాట్‌ ను కొనుగోలు చేసిందా?

జాన్వీ కపూర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాబోయే పాన్-ఇండియా 'దేవర'తో టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది.

  • Written By:
  • Updated On - September 30, 2023 / 05:50 PM IST

Janhvi: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాబోయే పాన్-ఇండియా ‘దేవర’తో టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై చాలా హైప్ ఉంది. ఎన్టీఆర్ పక్కన శ్రీదేవి కూతురు ఎలా ఉంటుందో చూడాలని టాలీవుడ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీ నుండి జాన్వీకి చాలా ఆఫర్లు వస్తున్నాయని సోర్సెస్ చెబుతున్నాయి. అయితే హైదరాబాద్, ముంబైకి నిరంతరం ప్రయాణించడం ఆమెకు సౌకర్యంగా లేదు. దీంతో ఈ యువ నటి హోటళ్లలో బస చేయాల్సి వస్తోంది. హైదరాబాద్‌లో తన కోసం ఖరీదైన ఇంట్లో స్టే చేయాలని ఫిక్స్ అయినట్టు సమాచారం.

నిత్యం ప్రయాణాలు చేయడం మానేయడానికి ఆమె కొన్ని వారాలు హైదరాబాద్‌లో, కొన్ని వారాలు ముంబైలో ఉంటున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జాన్వీ 3 కోట్ల విలువైన విలాసవంతమైన ఫ్లాట్‌ను కొనుగోలు చేసిందని నివేదికలు చెబుతున్నాయి.  అధికారిక వార్త ఇంకా బయటకు రాలేదు కానీ జాన్వీ నిర్ణయం అందర్నీ షాక్‌కి గురిచేస్తోంది.

‘దేవర’లో సైఫ్ అలీ ఖాన్ విలన్. ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ పతాకంపై కళ్యాణ్ రామ్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రత్నవేలు ISC ఫోటోగ్రఫీ డైరెక్టర్. యువ సంగీత సంచలనం అనిరుధ్ రవించందర్ సంగీతం అందిస్తుండగా, ఈ చిత్రం ఏప్రిల్ 5, 2024న తెలుగు, తమిళం, కన్నడ, హిందీ మరియు మలయాళ భాషల్లో విడుదల కానుంది.