Viswam Glimpse : గోపీచంద్ – శ్రీనువైట్ల ‘విశ్వం ‘ గ్లింప్స్ వచ్చేసింది

ఓ పెళ్లి వేడుకలో అపరిచితుడు లాగా పెద్ద గిటార్​తో గోపి చంద్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత గిటార్ బాక్స్​లో ఉన్న గన్​ను భుజం మీద పెట్టుకుని ఆ పెళ్లి వేడుకలోకి వెళ్లి అందరిని చంపేస్తూ విధ్వంసం సృష్టించారు.

  • Written By:
  • Publish Date - April 11, 2024 / 07:11 PM IST

గోపీచంద్ – శ్రీనువైట్ల (Gopichand – Sreenu Vaitla) కలయికలో విశ్వం (Viswam ) అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తాలూకా ఫస్ట్ గ్లింప్స్ (Viswam Glimpse) ను గురువారం విడుదల చేసి సినిమా ఫై బజ్ తీసుకొచ్చారు. ప్రస్తుతం శ్రీనువైట్ల సినీ కెరియర్ ఏమాత్రం బాగాలేదని సంగతి తెలిసిందే. కెరియర్ ప్రారంభంలో వరుస విజయాలతో దూకుడు చూపించిన శ్రీను… ఆ తర్వాత ఆగడు తో ఆగిపోయాడు. మహేష్ బాబు తో దూకుడు , ఆగడు చిత్రాలను డైరెక్ట్ చేసాడు. దూకుడు బాక్స్ ఆఫీస్ వద్ద దూకుడ్ని కనపరిస్తే..ఆగడు మాత్రం భారీ డిజాస్టర్ అయ్యి..శ్రీను వైట్ల కెరియర్నే ఆపేసింది. ఈ మూవీ తర్వాత శ్రీను వైట్లకు కు సినిమా ఛాన్సులు ఇచ్చేందుకు ఎవ్వరు పెద్దగా ఇంట్రస్ట్ చూపించలేదు. ఆ మధ్య ఒకటి , రెండు సినిమాలు చేసినప్పటికీ అవి కూడా భారీ డిజాస్టర్లు అయ్యాయి. ఈ క్రమంలో గోపీచంద్ ముందుకు వచ్చి ఊపిరి పోసాడు.

We’re now on WhatsApp. Click to Join.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ లో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకోవడం తో.. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ మేకర్స్ విడుదల చేసి.. సినిమా ఫై బజ్ తీసుకొచ్చారు. మాములుగా శ్రీను వైట్ల సినిమాలన్నీ కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటాయి. కానీ ఈ మూవీ మాత్రం యాక్షన్ తో తెరకెక్కిస్తున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్ధం అవుతుంది. గ్లింప్స్ చూస్తే..ఓ పెళ్లి వేడుకలో అపరిచితుడు లాగా పెద్ద గిటార్​తో గోపి చంద్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత గిటార్ బాక్స్​లో ఉన్న గన్​ను భుజం మీద పెట్టుకుని ఆ పెళ్లి వేడుకలోకి వెళ్లి అందరిని చంపేస్తూ విధ్వంసం సృష్టించారు. ఆ తర్వాత అక్కడ వండిన బిర్యానీని తీసుకుని “ప్రతి గింజ మీద తినేవాడి పేరు ఉంటుంది దీని మీద నా పేరు ఉంది” అంటూ హిందీ డైలాగ్​తో టీజర్ ముగించారు. టీజర్ బట్టి చూస్తే యాక్షన్ మూవీ గా అర్ధం అవుతుంది. మరి గోపి తో ఎలాంటి యాక్షన్ ను తెరకెక్కించారో తెలియాలంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే.

Read Also : Alleti Maheshwar Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కూలిపోతుందో తెలిపిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి