Prabhas Golden Heart: దటీజ్ ప్రభాస్.. రాధేశ్యామ్ కోసం 50 కోట్లు వెనక్కి ఇచ్చేసిన డార్లింగ్!

టాలీవుడ్ డార్లింగ్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ స్నేహితులకు, నిర్మాతలకు తెలియకుండా సాయం చేస్తుంటారు.

  • Written By:
  • Updated On - May 16, 2023 / 02:20 PM IST

టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ బాహుబలి మూవీతో పాన్ ఇండియా హీరోగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఏ మూవీ విడుదలైనా అటు ప్రేక్షకుల్లో, ఇటు టాలీవుడ్ లో విపరీతమైన అంచనాలు నెలకొంటున్నాయి. ఆయన హీరోగా నటించిన సాహో, రాధే శ్యామ్ మూవీలపై ఓ కూడా రేంజ్ అంచనాలు ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే, రెండు సినిమాలు భారీ బడ్జెట్‌తో నిర్మించినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలయ్యాయి. ఊహించని విధంగా సినిమాలకు నష్టాలు రావడంతో గోల్డెన్ హార్ట్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ తన పే చెక్ నుండి భారీ మొత్తాన్ని తిరిగి ఇచ్చాడు.

బాక్సాఫీస్ వద్ద రాధే శ్యామ్ నష్టాలను భరించేందుకు తన రెమ్యూనరేషన్ నుంచి 50 కోట్లు తిరిగి ఇచ్చాడట. ఈ చిత్రంలో విక్రమ్ ఆదిత్య పాత్ర కోసం ప్రభాస్ రూ. 100 కోట్ల పారితోషికం తీసుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భారీ పరాజయం పాలవడంతో భారీ నష్టాలను చవిచూసిన నిర్మాతలకు సహాయం చేయడానికి తన రెమ్యునరేషన్‌లో సగం తిరిగి ఇచ్చాడు. నిర్మాతల క్షేమం కోరి సగం పారితోషికం ఇచ్చాడు ప్రభాస్. అయితే, ఈ విషయాన్ని మేకర్స్ ధృవీకరించనప్పటికీ, ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే, అభిమానులు ప్రభాస్ ను అభినందించారు. సోషల్ మీడియా వేదికగా దటీజ్ డార్లింగ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

రాధే శ్యామ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. T సిరీస్‌తో కలిసి UV క్రియేషన్స్ నిర్మించారు. పూజా హెగ్డే ఈ చిత్రంలో కథానాయికగా నటించింది. రాధే శ్యామ్ 11 మార్చి 2022న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీకి మిక్స్ డ్ పబ్లిక్ టాక్ వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో శృతి హాసన్ కలిసి నటించిన సాలార్‌ మూవీలో నటించాడు. ఈ మూవీ విడుదల తేదీని ఖరారు చేయాల్సి ఉంది. అయితే సాలార్ తర్వాత వీరిద్దరూ పౌరాణిక చిత్రం కోసం మళ్లీ కలుస్తారని తెలుస్తోంది. కాగా ప్రభాస్ ఆదిపురుష్ మూవీతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరో మూడు పాన్ ఇండియా సినిమాల్లో ప్రభాస్ నటిస్తున్నాడు.

Also Read: Arjun Tendulkar: ‘నన్ను కుక్క కరిచింది బ్రో’.. అర్జున్ టెండూల్కర్ వీడియో వైరల్!