Shihan Hussaini : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు మార్షల్ ఆర్ట్స్ నేర్పిన షిహాన్ హుసైని క్యాన్సర్తో కన్నుమూశారు. ఆయన పేరిట ఉన్న రికార్డుల గురించి తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇంతకీ అవేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :New Ministers : మంత్రివర్గ విస్తరణ.. ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణం ?
షిహాన్ రికార్డుల చిట్టా..
- షిహాన్ హుసైనీ 1964 డిసెంబరు 28న తమిళనాడులోని మదురైలో జన్మించారు.
- షిహాన్కు అత్యంత ఇష్టమైన హీరోయిన్ జయలలిత.
- షిహాన్కు ఆర్చరీ కూడా వచ్చు. తమిళనాడు ఆర్చరీ అసోసియేషన్ వ్యవస్థాపకుల్లో ఈయన కూడా ఒకరు.
- 2013లో 11 లీటర్ల రక్తాన్ని గడ్డ కట్టించి జయలలిత(Shihan Hussaini) ఆకృతిని రూపొందించారు. ఇందులో షిహాన్ రక్తం కూడా ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్న జయలలిత.. షిహాన్ను పిలిచి సున్నితంగా హెచ్చరించారు.
- జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ 2015లో షిహాన్ 300 కేజీల బరువైన చెక్క శిలువను మోశారు. ఆ క్రమంలో తన చేతులు, కాళ్లకు మేకులు కొట్టించుకున్నారు.
- జయలలిత పుట్టినరోజు సందర్భంగా తన రక్తంతో ఆమెకు సంబంధించిన 56 పెయింటింగ్స్ గీశారు.
- 22 అడుగుల పోప్ జాన్ పాల్2 కాంస్య విగ్రహం, వ్యోమగామి కల్పనా చావ్లా విగ్రహాన్ని షిహాన్ చెక్కారు.
- అప్పటి శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్స పెయింటింగ్ను పందిరక్తంతో షిహాన్ గీశారు.
- షిహాన్ తన కుడి చేతిపై నుంచి 101 కార్లను పోనిచ్చారు
- షిహాన్ తన ఒంటి చేతితో 5వేల టైల్స్, వెయ్యికుపైగా ఇటుకలను పగలగొట్టారు.
- షిహాన్ విషపూరితమైన నాగుపాము కాటుకు గురై బతికారు.
- షిహాన్ 140 లీటర్ల పెట్రోల్తో మంటలు వెలిగించి, వాటిలో నుంచి బయటికి సేఫ్గా వచ్చారు.
- 1980లో పొరపాటున హుసైనిని శ్రీలంక టెర్రరిస్ట్ అనుకుని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ను తిహార్ జైలుకు పంపారు.
- 1994లో అమెరికాలో జరిగిన ప్రపంచ ఇస్సిన్యూర్ వరల్డ్ కరాటే అసోసియేషన్ ఛాంపియన్ షిప్లోనూ హుసైనీ పాల్గొన్నారు.