Site icon HashtagU Telugu

Dadasaheb Phalke : భారతీయ సినిమా పితామహుడు.. దాదాసాహెబ్ ఫాల్కే గురించి తెలుసా ?

Dadasaheb Phalke Death Anniversary Father Of Indian Cinema Silver Screen Women Actress

Dadasaheb Phalke : భారతీయ చలనచిత్ర పితామహుడు.. ఎవరో తెలుసా ? దాదాసాహెబ్ ఫాల్కే.  ఈయన పూర్తి పేరు  దాదాసాహెబ్ ఫాల్కే ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. ఫాల్కే నేపథ్యం ఏమిటి ?  భారతీయ సినిమా ఇండస్ట్రీకి పితామహుడిగా ఎలా ఎదిగారు ? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :Baba Vanga : బాబా వంగా జోస్యం.. 2025 ఫిబ్రవరి తర్వాత వాళ్లకు అఖండ ధనయోగం

దాదాసాహెబ్ ఫాల్కే నేపథ్యం

  • దాదాసాహెబ్ ఫాల్కే 1870 ఏప్రిల్ 30న బొంబాయి ప్రెసిడెన్సీలోని త్రియంబక్‌లో జన్మించారు. 1944 ఫిబ్రవరి 16న 73 సంవత్సరాల వయసులో నాసిక్‌లో కన్నుమూశారు.
  • ఫాల్కే తన జీవిత కాలంలో చిత్రకారుడిగా, ప్రచురణకర్తగా, ఫోటోగ్రాఫర్‌గా, రంగస్థల కళాకారుడిగా రాణించారు. ప్రారంభంలో ఆయనకు వైఫల్యాలు ఎదురయ్యాయి. అయినా వెనుకంజ వేయలేదు.
  • ఫాల్కే సినిమా ప్రపంచం పట్ల చూపిన అంకితభావం, ఆయనకు అద్భుతమైన విజయాన్ని, గొప్ప మైలురాయిని అందించింది.
  • ఫాల్కేకు చిన్నప్పటి నుంచే కళలు అంటే ఇష్టం.
  • 1885లో సర్ జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో ఆయన ఒక సంవత్సరం పాటు డ్రాయింగ్ కోర్సు చేశారు.
  • బరోడాలోని మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయంలో ఆయిల్ అండ్ వాటర్ కలర్ పెయింటింగ్‌లో తన నైపుణ్యాలను మరింత మెరుగుపర్చుకున్నారు.
  • ఆర్కిటెక్చర్, మోడలింగ్‌పై ఆయనకున్న ఆసక్తి వల్లే తదుపరిగా సినిమా రంగంలోకి ప్రవేశించారు.
  • 1890లో ఫిల్మ్ కెమెరాను కొనుక్కుని ఫోటోగ్రఫీ, ప్రాసెసింగ్ అండ్ ప్రింటింగ్‌లలో ప్రయోగాలు చేశారు. తద్వారా దాదాసాహెబ్ ఫాల్కే చిత్రనిర్మాణ ప్రయాణం ప్రారంభమైంది.
  • సినిమాల పట్ల ఆయనకున్న మక్కువ క్రమంగా పెరిగింది. ఇందువల్లే 1912లో ఫాల్కే ఫిల్మ్స్ కంపెనీని స్థాపించారు.
  • 1913లో భారతీయ సినిమా చరిత్రలోనే తొలి పూర్తి నిడివి కలిగిన సినిమా రాజా హరిశ్చంద్రను ఫాల్కే నిర్మించారు. హరిశ్చంద్ర మహారాజు  పౌరాణిక కథ ఆధారంగా ఈ సినిమాను తీశారు. ఇది నిశ్శబ్ద చిత్రం. ఈ చిత్రం వాణిజ్యపరంగా, విమర్శనాత్మకంగా విజయవంతమైంది.  ఈ మూవీ భారతీయ చలనచిత్ర పరిశ్రమ పుట్టుకకు గుర్తుగా నిలిచింది.
  • ఫాల్కే(Dadasaheb Phalke) రెండో సినిమా పేరు.. మోహినీ భస్మాసూర్ (1913).
  • సినిమాల్లో మహిళల భావన తెలియని ఆ రోజుల్లో.. ఫాల్కే మహిళలను తన సినిమాల్లోని కీలక పాత్రల కోసం తీసుకున్నారు.
  • మోహినీ భస్మాసూర్  సినిమాలో దుర్గాబాయి కామత్ పార్వతిగా, ఆమె కుమార్తె కమలాబాయి గోఖలే మోహినిగా నటించారు.భారతీయ సినిమాలో ప్రముఖ పాత్రలు పోషించిన తొలి  మహిళలు వారే.
  • తన సినిమా కోసం మహిళలను సమీకరించడానికి, ఫాల్కే అప్పట్లో కొన్ని రెడ్ లైట్ ఏరియాలున్న ప్రాంతాల్లో కూడా పర్యటించారు.
  • భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఫాల్కే చేసిన అసమాన కృషికి గుర్తింపుగా, భారత ప్రభుత్వం 1969లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును స్థాపించింది. ఈ అవార్డును చిత్రనిర్మాతలు, కళాకారులకు అందిస్తుంటారు.