Bigg Boss 6: మనుషుల విలువ తెలిసింది.. ఎమోషనల్ పోస్ట్ చేసిన గీతూ రాయల్!

తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 రోజురోజుకి మరింత రసవత్తరంగా మారుతుంది. ఈసారి బిగ్ బాస్ సీజన్

  • Written By:
  • Updated On - November 7, 2022 / 08:01 PM IST

తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 రోజురోజుకి మరింత రసవత్తరంగా మారుతుంది. ఈసారి బిగ్ బాస్ సీజన్ 6 ఎక్కువగా మారు మోగిన కంటెస్టెంట్ గీతూ. ఈమె మొదటి ఎపిసోడ్ నుంచి నిన్న అనగా తొమ్మిదో వారం ఎలిమినేషన్స్ వరకు కూడా ప్రతి ఎపిసోడ్ వరకు ఆమె పేరు మారు మోగిపోయింది. అంతే కాకుండా ప్రోమో లు కూడా గీతూనే హైలెట్ చేస్తూ ఎక్కువగా విడుదల చేశారు బిగ్ బాస్. ఇక గేమ్ ల విషయంలో గీతూ కూడా దేనికైనా సై అంటూ ముందుండేది.

అంతేకాకుండా గేమ్ గెలవడం కోసం ఒకరి మనసు నొప్పించడానికి కూడా వెనకాడేది కాదు. ఈ విషయంలో ఆమె ప్రవర్తన చాలామంది బిగ్ బాస్ ప్రేక్షకులకు నచ్చలేదు. కాగా మొదట్లో బాగానే ఉన్న గీతూ రాను రాను తన యాటిట్యూడ్ మాటల వల్ల తనకన్ను తానే పొడుచుకుంది. దీంతో బోలెడంత నెగిటివిటిని మూట కట్టుకుంది. గెలుపు తప్ప ఎలిమినేషన్స్ విషయం గురించి కలలో కూడా ఊహించని గీతూ ని ఒక్కసారిగా ఎలిమినేట్ చేసి షాక్ ఇచ్చాడు బిగ్ బాస్.

 

గీతూ కూడా ఇక బిగ్ బాస్ హౌస్ లో తాను ఉండదు అన్న విషయాన్ని తట్టుకోలేకపోయింది. స్టేజ్ పై నాగార్జున ముందే ఫుల్ ఎమోషనల్ అయిపోయింది గీతూ. అయితే ఎలిమినేషన్స్ తర్వాత ఇంస్టాగ్రామ్ లో మొదటిసారి ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది గీతూ. ఆ పోస్ట్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. కాగా గీతూ ఆ పోస్ట్ లో ఈ విధంగా రాసుకొచ్చింది..నా జీవితంలో బిగ్‌బాస్‌ అత్యంత అందమైన ఫేజ్‌..కానీ అందులో నేను ఓడిపోయాను..మనుషుల విలువ తెలిసింది..నా తప్పులని క్షమించండి ప్లీజ్‌.. నన్ను నన్నుగా అర్థం చేసుకుని సపోర్ట్‌ చేసిన ప్రతి ఒక్కరికీ చచ్చిపోయేవరకు రుణపడి ఉంటాను అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చింది గీతూ.