Bigg Boss 6: ఓటింగ్ లో భారీ ట్విస్ట్.. డేంజర్ జోన్ లో ఆ ఇద్దరు కంటెస్టెంట్స్?

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 ముగింపు దశకు చేరుకుంటుండడంతో కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులలో

  • Written By:
  • Publish Date - November 30, 2022 / 03:21 PM IST

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 ముగింపు దశకు చేరుకుంటుండడంతో కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులలో కూడా టెన్షన్ మొదలయింది. టాప్ ఫైవ్ లో ఏఏ కంటెస్టెంట్లు ఉంటారు. ఎవరు విన్నర్ గా నిలుస్తారు. అన్న టెన్షన్ ఇప్పటికే మొదలైంది. ఇది ఇలా ఉంటే 21 మంది కంటెస్టెంట్ లతో మొదలైన బిగ్ బాస్ షోలో ప్రస్తుతం 8 మంది కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. అయితే బిగ్ బాస్ ముగింపు దశకు చేరుకుంటుండడంతో కంటెస్టెంట్ల అభిమానులు వారి అభిమాన కంటెస్టెంట్ లను సేఫ్ చేయడం కోసం భారీగా ఓట్లు వేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా 13వ వారం ఓటింగ్ భారీ ట్విస్టులతో సెన్సేషన్ అవుతోంది. ఇంకా 13వ వారం జరిగిన ఓట్లు పోల్ చూసుకుంటే సింగర్ రేవంత్ మొదటి స్థానంలోనే ఉన్నాడు. రేవంత్ తర్వాత వరుసగా రెండో స్థానంలో రోహిత్, మూడో స్థానంలో కీర్తి భట్, నాలుగో స్థానంలో శ్రీ సత్యలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఒకవేళ ఇది చివరి వరకు కంటిన్యూ అయితే టాప్ ఫైవ్ లో ఉన్న ఈ కంటెస్టెంట్లు అందరూ సేవ్ అవుతారు. కాగా శ్రీహాన్ ఫ్యాన్స్ ఓట్లు శ్రీ సత్యకు పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఓటింగ్ లో ఆది రెడ్డి ఐదు, ఫైమా ఆరవ స్థానాలలో ఉన్నట్లు సమాచారం.

అంటే ఈ వారానికి వీళ్లిద్దరూ డేంజర్‌ జోన్‌లో పడిపోయారు. ఈ సీజన్‌లోనే తొలిసారి ఆది రెడ్డికి ఓటింగ్ చాలా తగ్గిపోయినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆదిరెడ్డి పైమాల ఓటింగ్ లు ఇలాగే కొనసాగితే 13వ వారం ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోవచ్చు. మరి ఆదిరెడ్డి ఫైమా వారి ఆట తీరును మార్చుకొని వారి స్థానాలు మార్చుకుంటారా లేదా తెలియాలి అంటే ఈ వారం పూర్తి అయ్యేంతవరకు వేచి చూడాల్సిందే మరి.