తాజాగా బిగ్ బాస్ హౌస్ లో ఈడో వారం కెప్టెన్సీ టాస్క్ పోటీలో భాగంగా సెలబ్రిటీ గేమింగ్ లీగ్ అనే టాస్క్ ను ఇచ్చాడు బిగ్ బాస్. ఆ టాస్క్ సరిగా ఆడకపోయే సరికి కంటెస్టెంట్స్ అందరినీ గార్డెన్ ఏరియా లోకి పిలిచి సీరియస్ అయ్యాడు బిగ్ బాస్. అంతే కాకుండా బిగ్ బాస్ చరిత్రలోనే ఇటువంటి చెత్త ఆటను చూడలేదు అంటూ కంటెస్టెంట్స్ పై సీరియస్ అయ్యాడు. అలాగే సెలబ్రిటీ గేమింగ్ టాస్క్ ని కూడా నిలిపివేశాడు. హౌస్లో ఈ వారం కెప్టెన్ ఉండబోడని స్పష్టం చేశాయి.
కాగా రద్దీ అవ్వడానికి శ్రీ సత్య ఒక రకంగా కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే శ్రీ సత్య అర్జునుని రెచ్చగొట్టి మరి రేవంత్ తో గొడవకు పంపింది. దీంతో వారు టాస్క్ లో నుంచి బయటకు వచ్చేసి గొడవపడ్డారు. రెండు టీమ్లుగా విడిపోయిన కంటెస్టెంట్స్కి వాల్పోస్టర్ అనే చాలెంజ్ని ఇచ్చాడు బిగ్బాస్. ఇందులో భాగంగానే రెండు టీమ్ సభ్యులు వాల్పోస్టర్లను అతికించడం ప్రారంభించారు. మధ్యలో అర్జున్ ఏదో అంటుంటే అరేయ్ పప్పు అని రేవంత్ అంటాడు.
ఆ విషయాన్ని అర్జున్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ శ్రీసత్య మాత్రం నిన్ను ఏమైనా అంటే రియాక్ట్ అవ్వవా, మనిషివి కావా అంటూ కసురుకుంది. దాంతో అర్జున్ రేవంత్ తో గొడవ పెట్టుకున్నాడు. ఇద్దరు పాత్రల్లోంచి బయటకు వచ్చి మరి తిట్టుకుంటారు. ఈ గొడవ తర్వాత ఇంటి సభ్యులెవరు తమ తమ పాత్రల్లో ఉన్నట్లు కనిపించదు. అసలే ఎంటర్టైన్మెంట్ లేదు.. పోనీ గేమ్ అయినా సరిగా ఆడుతున్నారా అంటే అదీ లేదు. కంటెస్టెంట్లపై సీరియస్ అవ్వడం మాత్రమే కాకుండా ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు అంటూ బిగ్ బాస్ గేట్ ని కూడా ఓపెన్ చేసి పెట్టాడు.