Bigg Boss 6: డేంజర్ జోన్ లో ముగ్గురు కంటెస్టెంట్స్.. ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

  • Written By:
  • Updated On - November 5, 2022 / 02:55 PM IST

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 రసవత్తరంగా సాగుతోంది. కాగా అప్పుడే బిగ్ బాస్ తొమ్మిదో వారం ఎలిమినేషన్స్ దగ్గర పడింది. ఇకపోతే తొమ్మిదో వారం నామినేషన్స్ లో ఇనయ, గీతూ, రేవంత్, ఆదిరెడ్డి, కీర్తి, ఫైమా, శ్రీసత్య, ఇంకా మరీనా, రోహిత్ లు ఉన్నారు. అయితే ఈ వారం కెప్టెన్ గా శ్రీహన్ సేఫ్ జోన్ లో ఉన్నాడు. అలాగే వాసంతి, రాజ్ లని ఎవరూ నామినేట్ చెయ్యలేదు. అయితే నామినేషన్స్ లో టాప్ లో ఉండే రేవంత్ కాస్త నోరు అదుపులో పెట్టుకోకపోవడం వల్ల అతనికి పరంగా టాప్ లో ఉన్నప్పటికీ బయట మాత్రం నెగటివ్ బాగానే కనపడుతోంది.

సూర్య ఎలిమినేట్ తర్వాత ఇనయ ని ప్రతి ఒక్కరూ టార్గెట్ చేయడంతో ఆమెపై సింపతి పెరిగిపోయింది. అంతేకాకుండా ఇనయ కూడా టాస్కుల విషయంలో గట్టిగానే పోరాడుతోంది. అందరూ ఇనయ అని టార్గెట్ చేసి మాట్లాడడంతో ఆమెకు సింపతితో ఓట్లు భారీగా పెరిగిపోయాయి. ఇకపోతే గీతూ గతవారం చేసిన పనికి అలాగే, బాలాదిత్యా విషయంలో అలా ప్రవర్తించిన దానికి ప్రేక్షకులకు కోపం వచ్చినట్లు కనిపిస్తోంది. ఇక మూడవ స్థానంలో ఉన్న గీతూ స్థానంలోకి బాలాదిత్య చేరుకున్నాడు.

ఇక నాలుగో స్థానంలో కీర్తి రెడ్డి ఐదవ స్థానంలో శ్రీ సత్య కొనసాగుతున్నారు. ఇక ఆరవ స్థానంలో రోహిత్ ఉండగా ఏడవ స్థానంలో ఆది రెడ్డి ఉన్నాడు. అయితే టాస్కుల విషయంలో అలాగే ఎదుటి వ్యక్తిని వెటకారంగా మాట్లాడించడంతో ఫైమాకి ఓట్లు తగ్గి ఆమె ఎనిమిదవ స్థానానికి దిగజారిపోయింది. మరీనా తొమ్మిదవ స్థానంలో ఉంది. ఇక అందరికీ చివరిగా పదవ స్థానంలో డేంజర్ జోన్ లో గీతూ ఉండడం అందరికీ షాక్ ఇస్తోంది. ఇక ఇది ఇలా ఉంటే వారం వారం హౌస్ లో ఓటింగ్ తో సంబంధం లేకుండా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఒక్కొక్కరిగా ఎలిమినేట్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే డేంజర్ లో ఉన్న గీతూ ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి బిగ్ బాస్ గీతూ ని సేవ్ చేస్తూనే వస్తున్నాడు ఉన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరి డేంజర్ జోన్ లో ఉన్న పైమా, మరీనా, గీతూ లలో ఎవరు తొమ్మిదవ వారం ఎలిమినేట్ అవుతారో చూడాలి మరి.