Manchu Vishnu: జిన్నా మూవీ టీంకు బిగ్ షాక్…దారుణంగా అమ్ముడుపోయిన టికెట్లు..!!

జిన్నా...ఈ సినిమా దీపావళి సందర్భంగా అక్టోబర్ 21 శుక్రవారం థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అయితే ఈ మూవీకి వస్తున్న కలెక్షన్లు చూసి అంతా షాక్ అవుతున్నారు.

  • Written By:
  • Updated On - October 22, 2022 / 12:35 PM IST

జిన్నా…ఈ సినిమా దీపావళి సందర్భంగా అక్టోబర్ 21 శుక్రవారం థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అయితే ఈ మూవీకి వస్తున్న కలెక్షన్లు చూసి అంతా షాక్ అవుతున్నారు. జిన్నా టీం అయితే దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. మంచు విష్ణు హీరోగా నటించిన ఈ మూవీకి సూర్య దర్శకత్వం వహించారు. సొంతబ్యానర్లో ఈ మూవీ నిర్మించారు మంచు విష్ణు. విష్ణుకు జోడిగా పాయలో, సన్నీ లియోన్ నటించారు.

అయితే ఈ మూవీ ప్రమేషన్స్ లో మాత్రం ప్రతి ఒక్కరినీ సర్ ప్రైజ్ చేస్తుందని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. సర్ ప్రైజ్ చేసిందో లేదో తెలియదు కానీ…కలెక్షన్లు చూస్తే మాత్రం అంతా సర్ ప్రైజ్ అవ్వాల్సిందే. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి కేవలం 16లక్షలే వచ్చాయి. ఓవర్సీస్ గురించి మాట్లాడుకోకుంటేనే బాగుంటుంది. మరి దారుణంగా పడిపోయింది. అమెరికాలో 17 లొకేషన్లలో 50కు పైగా షోలు వేస్తే..కేవలం 493 డాలర్లు మాత్రమే వచ్చాయి. అంటే భారతీయ కరెన్సీలో కేవలం 40వేలు. దీంతో జిన్నా కలెక్షన్స్ చూసి ఇండస్ట్రీ షాక్ అవుతోంది.