Pushpa 2 : నైజంలో పుష్ప 2 థియేటర్ రైట్స్ తగ్గేదేలే.. 100 కోట్లు దాటేసింది..

నైజంలో పుష్ప 2 థియేటర్ రైట్స్ తగ్గేదేలే అంటున్నాయి. ఈ మూవీ థియేటర్ రైట్స్ దక్కించుకోవడం కోసం డిస్ట్రిబ్యూటర్స్..

  • Written By:
  • Publish Date - April 9, 2024 / 12:31 PM IST

Pushpa 2 : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఆడియన్స్ ముందుకు వచ్చి ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నేషనల్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు ఈ మూవీ మ్యానియా చేరుకుంది. దీంతో ఈ మూవీ సెకండ్ పార్ట్ కోసం వరల్డ్ వైడ్ ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఈ క్యూరియాసిటీతో ఈ రెండో భాగం థియేట్రికల్, డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ ఓ రేంజ్ లో పలుకుతున్నాయి. తెలుగు స్టేట్స్ లో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకోవడం కోసం డిస్ట్రిబ్యూటర్స్ గట్టిగా పోటీ పడుతున్నారు. ఈ పోటితోనే కేవలం ఒక్క నైజం ప్రాంతానికి చెందిన థియేట్రికల్ రైట్స్ 100 కోట్లు వరకు చేరుకున్నాయి. ఈ పోటీ బేరం ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే నైజంలో ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేసేలా కనిపిస్తున్నారు. ఈ నిర్మాతలు ఇటీవల డిస్ట్రిబ్యూషన్ లోకి దిగిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాని నైజంలో తామే రిలీజ్ చేసి లాభాలు అందుకోవాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 400 కోట్లవరకు జరిగే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.

ఈ సినిమాని ఆగష్టు 15న రిలీజ్ చేయబోతున్నారు. దాదాపు ఐదు రోజుల సెలవులతో లాంగ్ వీకెండ్ సినిమాకి కలిసొస్తుంది. అయితే ఆ సమయంలోనే బాలీవుడ్ నుంచి ‘సింగం ఎగైన్’ మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద సింగంని పుష్ప ఎలా ఎదుర్కుంటాడో చూడాలి.

Also read : Pushpa 2 : పుష్ప 2 ఆ సీన్ కోసం 51 ఒక్క టేకులు తీసుకున్నారా..?