Adipurush Update: ఆయోధ్యలో ‘ఆదిపురుష్’ టీజర్.. అంచనాలు పెంచుతున్న ప్రభాస్!

'బాహుబలి' తర్వాత ప్రభాస్ అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఆయన సినిమాలన్నీ పాన్ ఇండియా

  • Written By:
  • Publish Date - September 26, 2022 / 11:30 AM IST

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువయ్యాడు. దీంతో ఆయన నటిస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్నాయి. ప్రస్తుతం ‘ఆది పురుష్’, ‘సాలార్’, ‘ప్రాజెక్ట్-కె’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లలో ‘ఆదిపురుష’పై భారీస్థాయిలో హైప్ ఉంది. రామాయణం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తుండగా, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. కానీ, ఇప్పటి వరకు ‘ఆదిపురుష’ ఫస్ట్‌లుక్‌ని చిత్ర బృందం విడుదల చేయలేదు. అప్‌డేట్స్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అక్టోబర్ మొదటి వారం నుంచి ‘ఆదిపురుష’ ప్రమోషన్స్ మొదలవుతాయని బాలీవుడ్ మీడియా చెబుతోంది. అక్టోబరు 2న ‘ఆదిపురుష’ టీజర్ విడుదల కానున్నట్టు తెలుస్తోంది.రామ జన్మస్థలమైన అయోధ్యలో టీజర్ ను గ్రాండ్ గా లాంచ్ చేయనున్నట్లు సమాచారం. టీజర్ లాంచ్ తోనే మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారని బి టౌన్ మీడియా అంటోంది. ఓం రౌత్ గతంలో ‘తాన్హాజీ’కి దర్శకత్వం వహించారు. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. అందుకే, ఓం రౌత్, ప్రభాస్ కాంబినేషన్‌పై భారీ బజ్ ఉంది.

కాగా, ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 5న ఈ మైదానంలో జరిగే ‘రావణ దహన్’లో ప్రభాస్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. ‘ఆదిపురుష’ చిత్రాన్ని భూషణ్‌ కుమార్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో, కృతి సనన్ సీత పాత్రలో, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా కనిపించనున్నారు.