Actor Nandu: 800 మందికి వండి వడ్డించిన నటుడు నందు.. నెట్టింట వీడియో వైరల్?

తెలుగు ప్రేక్షకులకు నటుడు నందు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకవైపు బుల్లుతెరపై యాంకర్ గా రాణిస్తూనే మరొకవైపు వెండితెరపై సినిమాలు

  • Written By:
  • Updated On - February 14, 2024 / 09:27 AM IST

తెలుగు ప్రేక్షకులకు నటుడు నందు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకవైపు బుల్లుతెరపై యాంకర్ గా రాణిస్తూనే మరొకవైపు వెండితెరపై సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. అలాగే అంతేకాదు ఐపీఎల్‌ లాంటి ధనాధన్ క్రికెట్‌ టోర్నమెంట్లలో స్పోర్ట్స్‌ యాంకర్‌ గానూ తన ట్యాలెంట్‌ చూపిస్తున్నాడు నందు. కాగా నందు టాలీవుడ్ ప్రముఖ లేడీ సింగర్ గీతామాధురిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు మా పాప కూడా జన్మించింది. నందు ఇప్పటివరకు సుమారు 25కు పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నందు. ఇటీవల అతను నటించిన మ్యాన్షన్ 23, వధువు వెబ్‌ సిరీస్ లకు ఓటీటీల్లో మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

ఇక వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. త్వరలో మరోసారి తండ్రిగా ప్రమోషన్‌ పొందనున్నాడు నందు. అతని భార్య ప్రముఖ సింగర్‌ గీతా మాధురి త్వరలోనే ఒక పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఇటీవలే కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో గీతా మాధురి సీమంతం వేడుకగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇకపోతే ఈ మధ్యకాలంలో నందు దంపతులు ఇంట్లో శుభకార్యాలు చేస్తూ వార్తలు నిలుస్తున్నారు. తాజాగా ఏకంగా ఎనిమిది వందల మంది ఆకలి తీర్చాడు నందు. శ్రీ విద్యాపీఠంలో అన్నపూర్ణార్చన చేసిన నందు 800 మందికి ఆహారాన్ని అందించారు. తానే స్వయంగా ఫుడ్‌ ప్రిపేర్‌ చేశాడు. అందరికీ వడ్డించాడు.

 

అన్నదానం తర్వాత కూడా పాత్రలు కూడా కడిగాడు. యాక్టర్‌ అన్న ట్యాగ్‌ ను పక్కన పెట్టి ప్రతి పనిలోనూ చేయి అందించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో గా మారింది. ఆ వీడియోని చూసిన నెటిజన్స్ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. నందు దంపతులు రియల్లీ చాలా గ్రేట్, వీరికి పుట్టి పోయే బిడ్డ అందంగా ఆరోగ్యంగా పుట్టాలని కోరుకుంటున్నాము అంటూ కామెంట్లు చేస్తున్నారు. సెలబ్రిటీ అయి ఉండి ఒక సామాన్య వ్యక్తులా వడ్డీ వండించడం అన్నది నిజంగా గొప్ప విషయం అంటూ కామెంట్లు చేస్తున్నారు.