ఫోన్లలో ‘ఆధార్ యాప్’ ప్రీ-ఇన్‌స్టాల్ ప్లాన్ రద్దు.. కారణం ఇదే!

భారతదేశంలో అత్యధికంగా ఉపయోగించే గుర్తింపు పత్రాలలో ఆధార్ ఒకటి. దేశంలో సుమారు 1.34 బిలియన్ల మందికి 12 అంకెల ఆధార్ నంబర్ ఉంది. దీనిని బట్టి దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు.

Published By: HashtagU Telugu Desk
Aadhaar App

Aadhaar App

Aadhaar App: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ఒక ముఖ్యమైన అప్‌డేట్ వెలువడింది. ప్రతి ఫోన్‌లో ఆధార్ యాప్‌ ముందే ఇన్‌స్టాల్ అయి వచ్చేలా ప్రభుత్వం, UIDAI చేస్తున్న ఆలోచన ప్రస్తుతానికి నిలిపివేయబడింది. అంటే ఇకపై మీరు కొత్త ఫోన్ కొనుగోలు చేసినప్పుడు అందులో ఆధార్ యాప్ ముందే ఇన్‌స్టాల్ అయి ఉండదు. స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీల అభ్యంతరాలు, సాంకేతిక పరమైన ఆందోళనలే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం.

ప్రీ-ఇన్‌స్టాల్ ఆధార్ యాప్ ప్లాన్ ప్రస్తుతానికి రద్దు

స్మార్ట్‌ఫోన్లలో ఆధార్ యాప్‌ను ముందే అందించాలని UIDAI, కేంద్ర ప్రభుత్వం ఉమ్మడిగా వేసిన ప్రణాళికను ముందుకు తీసుకెళ్లకూడదని నిర్ణయించారు. దీనివల్ల Apple, Samsung వంటి ఇతర కంపెనీలకు పెద్ద ఉపశమనం లభించింది. ఇకపై వారు తమ పరికరాల్లో ఆధార్ యాప్‌ను తప్పనిసరిగా చేర్చాల్సిన అవసరం లేదు.

ఈ ప్రతిపాదనను ఎందుకు తీసుకువచ్చారు?

గుర్తింపు ధృవీకరణ, బ్యాంకింగ్ సేవలు, టెలికాం కనెక్షన్లు, ఎయిర్‌పోర్ట్ ఎంట్రీ వంటి సేవలను వినియోగదారులకు మరింత సులభతరం చేయడమే ప్రభుత్వం ఉద్దేశ్యం. యాప్ ముందే ఫోన్‌లో ఉంటే ఈ సేవలు మరింత వేగంగా అందుతాయని భావించారు.

Also Read: ఎల్లుండి ఇరాన్- అమెరికా మధ్య చర్చలు?!

దేశంలో పెరుగుతున్న ఆధార్ వినియోగం

భారతదేశంలో అత్యధికంగా ఉపయోగించే గుర్తింపు పత్రాలలో ఆధార్ ఒకటి. దేశంలో సుమారు 1.34 బిలియన్ల మందికి 12 అంకెల ఆధార్ నంబర్ ఉంది. దీనిని బట్టి దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు.

IT మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరణ

నివేదికల ప్రకారం.. ఈ విషయంపై చర్చలు జరపాలని జనవరిలో UIDAI.. ఐటీ మంత్రిత్వ శాఖను కోరింది. అయితే ఐటీ మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపలేదు.

కంపెనీలు ఎందుకు వ్యతిరేకించాయి?

సాంకేతిక కారణాలు: ఫోన్ల పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉంది.

ఖర్చు: దీని కోసం ప్రత్యేక తయారీ సెటప్ అవసరమవుతుంది. తద్వారా ఖర్చు పెరుగుతుంది.

ప్రైవసీ: ముఖ్యంగా Apple, Samsung కంపెనీలు వినియోగదారుల డేటా భద్రత, ప్రైవసీ గురించి ఆందోళన వ్యక్తం చేశాయి. వినియోగదారుల డేటా రిస్క్‌లో పడటం ఆ కంపెనీలకు ఇష్టం లేదు.

వినియోగదారులే స్వయంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి

ప్రతి ప్రభుత్వ యాప్‌ను ఫోన్‌లో ముందే ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి ఇకపై వినియోగదారులు తమ అవసరానికి అనుగుణంగా ఆధార్ యాప్‌ను స్వయంగా డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. గత రెండేళ్లలో ఇలా ఏదైనా యాప్‌ను ప్రీ-ఇన్‌స్టాల్ చేయాలని ప్రభుత్వం ప్రయత్నించడం ఇది ఆరోసారి. ప్రతిసారీ పరిశ్రమ వర్గాల నుండి వ్యతిరేకత రావడంతో ఈసారి కూడా సాంకేతిక కారణాల దృష్ట్యా ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు.

  Last Updated: 18 Apr 2026, 12:10 PM IST