Petrol- Diesel Prices: మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. ప్రస్తుతం ఈ భారాన్ని దేశీయ చమురు సంస్థలు భరిస్తున్నప్పటికీ ఎన్నికల తర్వాత ఆ భారం వినియోగదారులపై పడే అవకాశం ఉందని కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వెల్లడించింది.
పెట్రోల్-డీజిల్ ధరలు ఎందుకు పెరుగుతాయి?
హోర్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. దీనివల్ల ముడిచమురు ధరలు వేగంగా పెరిగాయి. ఫిబ్రవరి 27న బ్యారెల్ ధర 72 డాలర్లు ఉండగా, ప్రస్తుతం అది 103 డాలర్లకు చేరుకుంది. భారతదేశంలో ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు సామాన్యుల కోసం ధరలను పెంచలేదు. దీనివల్ల చమురు సంస్థలు కొనుగోలు చేసే ధరకు, కస్టమర్లకు అమ్మే ధరకు మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడింది. గతంలో ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని రూ. 10 తగ్గించినప్పటికీ చమురు సంస్థలకు నెలకు సుమారు రూ. 27 వేల కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది.
Also Read: Akira Nandan : రేణు డైరెక్షన్లో అకిరా ఎంట్రీ ?
సామాన్యుడి జేబుపై ప్రభావం ఎలా ఉంటుంది?
పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే దాని ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా సామాన్యుడిపై పడుతుంది. ప్రత్యక్షంగా చూసుకుంటే ఒకవేళ లీటరుకు రూ. 25 పెరిగితే, 15 లీటర్ల ట్యాంక్ సామర్థ్యం గల బైక్ను ఫుల్ చేయించుకోవడానికి అదనంగా రూ. 375 చెల్లించాల్సి ఉంటుంది. స్కూటీ ట్యాంక్ కోసం రూ. 100 కంటే ఎక్కువ ఖర్చు చేయాలి. ఆటో, బస్సు, క్యాబ్ చార్జీలు కూడా పెరిగే అవకాశం ఉంది. పరోక్షంగా డీజిల్ ధరల పెంపు వల్ల రవాణా ఖర్చులు పెరుగుతాయి. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. అంటే పాలు, కూరగాయలు, ఇతర వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడి బడ్జెట్ తలకిందులయ్యే ప్రమాదం ఉంది.
