YSRCP Manifesto 2024: ఫిబ్రవరి 18న సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫిబ్రవరి, మార్చి నెలలో తనషెడ్యూల్‌ను ప్రకటించారు. 2024 ఎన్నికల కోసం ఆయన పునరాగమనం బాట పట్టారు.

YSRCP Manifesto 2024: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫిబ్రవరి, మార్చి నెలలో తనషెడ్యూల్‌ను ప్రకటించారు. 2024 ఎన్నికల కోసం ఆయన పునరాగమనం బాట పట్టారు. ముఖ్యమంత్రి వివిధ పథకాల కింద నిధుల పంపిణీలో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను ఎప్పుడు సందర్శిస్తారో మరియు చివరి మంత్రివర్గ సమావేశాన్ని ఎప్పుడు నిర్వహించాలో తాజా షెడ్యూల్ లో పేర్కొన్నారు అంతేకాదు వచ్చే ఎన్నికలకు తన ఎన్నికల మేనిఫెస్టోని ఎప్పుడు ప్రకటిస్తారో షెడ్యూల్ లో పేర్కొన్నారు.

సీఎం జగన్ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 13న విశాఖపట్నంలో జరిగే ‘ఆడుదాం ఆంధ్రా’ ఫైనల్స్‌కు హాజరవుతారు, ఆ తర్వాత ఫిబ్రవరి 16న కుప్పంలో వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదల చేస్తారు. 18వ తేదీన సిద్ధం చివరి బహిరంగ సభను నిర్వహించనున్నారు. అనంతపురం జిల్లా రాప్పాడులో జరిగే ఈ సభలోనే కొత్త ఎన్నికల మేనిఫెస్టో‌ను విడుదల చేయనున్నారు వైఎస్ జగన్. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన నవరత్నాలకు మించిన స్థాయిలో హామీలు ఉండొచ్చనే అంటున్నారు. ఫిబ్రవరి 21న అన్నమయ్య జిల్లాలో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల కార్యక్రమం ఉంటుంది. అలాగే నేను మీ కోసం 124 సార్లు బటన్‌ను నొక్కాను, పోలింగ్ రోజు నా కోసం రెండు బటన్లు నొక్కండని ప్రజలకు వైఎస్ జగన్ పిలుపునిస్తారు. ఫిబ్రవరి 24న కర్నూలులో మూడో దశ ఈబీసీ నేస్తం పంపిణీ, ఫిబ్రవరి 27న గుంటూరులో జగనన్న విద్యాదీవెన నాలుగో త్రైమాసికం, మార్చి 5న శ్రీ సత్యసాయి జిల్లాలో రెండో దశ జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారు.

ముఖ్యమంత్రి మార్చి 6న తుది మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించనున్నారు, ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అంతేకాకుండా, వాలంటీర్ ఫెలిసిటేషన్ కార్యక్రమం ఫిబ్రవరి మూడవ లేదా నాల్గవ వారంలో నిర్వహించబడుతుంది; అయితే అధికారిక తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది.

Also Read: Rs 50 Lakh Contract : నన్ను చంపేందుకు రూ.50 లక్షల కాంట్రాక్ట్ ఇచ్చారు.. మంత్రి సంచలన వ్యాఖ్య