Whats Today : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రేపే (నవంబరు 30). ఈసందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రేపు సెలవు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, అన్ని విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. పోలింగ్ కేంద్రాలున్న విద్యాసంస్థలకు ఈ రోజు, రేపు కూడా సెలవు ఉంటుంది.
- తిరుమలలో 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల టైం పడుతోంది.
- నారా లోకేష్ యువగళం పాదయాత్ర 212వ రోజుకు చేరింది. ఇవాళ ఉదయం 10 గంటలకు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం ఉమెన్స్ డిగ్రీ కాలేజీ నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. నారా లోకేష్ పాదయాత్ర 2900 కిలోమీటర్లకు చేరిన సందర్భంగా పాత ఇంజరం వద్ద శిలాఫలకం ఆవిష్కరిస్తారు.
- ఇవాళ వైసీపీ సామాజిక సాధికార యాత్ర 24వ రోజుకు చేరుకుంది. ఇవాళ బస్సు యాత్ర జరిగే నియోజకవర్గాలలో మచిలీపట్నం(కృష్ణా జిల్లా), కురుపాం(పార్వతీపురం మన్యం జిల్లా) ఉన్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
- అమరావతిలో ఇవాళ సీవేజ్ సక్షన్ వాహనాలను సీఎం జగన్ లాంచ్ చేయనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం దగ్గర ఈ కార్యక్రమం జరుగుతుంది.
- రేపు(గురువారం) చంద్రబాబు తిరుమలలో పర్యటిస్తారు. రేపు సాయంత్రం తిరుమలకు చేరుకోనున్న చంద్రబాబు, శ్రీరచనా అతిథిగృహంలో బస చేస్తారు. ఎల్లుండి ఉదయం ముందుగా వరాహస్వామివారిని చంద్రబాబు దంపతులు దర్శించుకుంటారు. అనంతరం శ్రీవారిని(Whats Today) దర్శించుకుంటారు.