Site icon HashtagU Telugu

Whats Today : మేడిగడ్డకు మంత్రులు.. రూ.584 కోట్ల ‘విద్యాదీవెన’ నిధుల విడుదల

Whats Today

Whats Today

Whats Today : ఇవాళ  తెలంగాణ మంత్రుల బృందం మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టులను సందర్శించనుంది.  ఆయా ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితులను మంత్రులు పరిశీలించనున్నారు.  మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తొలుత కాళేశ్వరం ప్రాజెక్టును ఏరియల్ సర్వే చేస్తారు.  అనంతరం మేడిగడ్డ డ్యామ్ 19, 20, 21 పిల్లర్లు ఎందుకు కుంగిపోయాయో దగ్గరకు వెళ్లి చూస్తారు. ఈ పిల్లర్లు కుంగిపోవడంతో తెలంగాణ – మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోవడానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.

We’re now on WhatsApp. Click to Join.

Also Read: Trump Blocked : ట్రంప్‌పై ‘మెయిన్’ బ్యాన్.. అధ్యక్ష ఎన్నికల బాటలో రెడ్ సిగ్నల్