Pegasus Spyware: అతి త్వ‌ర‌లో.. బాబు ఫైల్స్ ఓపెన్..?

  • Written By:
  • Publish Date - March 19, 2022 / 03:08 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో పెగాసస్ వివాదం ఓ రేంజ్‌లో ప్ర‌కంప‌న‌లు రేపుతున్న సంగ‌తి తెలిసిందే. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధుల‌పై నిఘా ఉంచేందుకు అక్ర‌మంగా పెగాస‌స్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేశారంటూ, అధికార బీజేపీ పై ప్ర‌తిప‌క్షాలు ఆరోపించాయి. అయితే ఇప్పుడు ఈ పెగాసిస్ వివాదం ఏపీలో క‌ల‌క‌లం రేపుతోంది. తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పెగాసస్ పై చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఎవ‌రూ ఊహించని విధంగా మ‌మ‌తా బెన‌ర్జీ త‌న‌ పాత మిత్రుడు చంద్ర‌బాబును ఇరికించారు. అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళితే పెగాసస్‌ను కొనుగోలు చేయాల్సిందిగా త‌న ద‌గ్గ‌ర‌కు ఆఫర్ వచ్చిందని, అయితే అందుకు తాను నిరాక‌రించాన‌ని మ‌మ‌తా చెప్పారు. అంతేకాదు అప్పట్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగాఉన్న చంద్రబాబు పెగాస‌స్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేశారంటూ బాంబు పేల్చారు. దీంతో ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డిన చంద్ర‌బాబు అండ్ టీడీపీ త‌మ్ముళ్ళు వెంట‌నే మ‌మ‌తా బెన‌ర్జీ పై గుంపుగా అటాక్ మొద‌లు పెట్టిన సంగ‌తి తెలిసిందే.

ఇక ఈ పెగాసస్ స్పైవేర్ వివాదంలో ఏపీలో అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్ష టీడీపీల మ‌ధ్య ఓ రేంజ్‌లో మాట‌ల యుద్ధం సాగుతోంది. చంద్ర‌బాబు పై పెగాస‌స్ బాంబు పేల్చింది మ‌మ‌తా అయితే టీడీపీ నేత‌ల మాత్రం జ‌గ‌న్ అండ్ వైసీపీ నేత‌ల పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై మొద‌ట సైలెంట్‌గానే ఉన్న వైసీపీ నేత‌లు, ఇప్పుడు చంద్ర‌బాబు పై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. టెక్నాల‌జీ ఆద్యుడు 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ చంద్ర‌బాబు విజ‌న‌రీ భాగంగా పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనే ఉండొచ్చ‌ని వైసీపీ నాయ‌కులు సెటైర్స్ వేస్తున్నారు.

ఈ విష‌యం స్వ‌యంగా ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మమతా బెన‌ర్జీ వ్యాఖ్య‌లు చేయ‌డం ఇప్పుడు ఆనుమానాల‌కు తావిస్తుంద‌ని, ఏదో జ‌రిగింద‌నేది మాత్రం స్ప‌ష్టంగా తెలుస్తోంద‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా వైసీపీ రాజ్య‌స‌భ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చంద్ర‌బాబు పై సెటైర్స్ వేశారు. ది క‌శ్మీర్ ఫైల్స్ సినిమాను గుర్తు చేస్తూ త్వ‌ర‌లోనే బాబు ఫైల్స్ ఓపెన్ అవుతాయని వణికిపోతున్నారని, చేసిన పాపాలు కోడెనాగుల్లా వెంటపడుతున్నాయ‌ని చంద్ర‌బాబు పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు విజ‌య‌సాయిరెడ్డి. అంతే కాకుండా పెగాసస్ స్పైవేర్ కొనుగోలు విషయంపై ప‌శ్చిమ బెంగాల్ సీఎం మమతా బెన‌ర్జీ బాంబు పేల్చిన క్ష‌ణం నుంచి తండ్రీకొడుకులకు ముచ్చెమటలు పడుతున్నాయని, అప్ప‌ట్లో పార్టీల‌కు ఫండింగ్ చేసిన బాబు ఫైల్స్ ఓపెన్ అవుతాయ‌ని చంద్ర‌బాబు భ‌యంతో వ‌ణికిపోతున్నార‌ని విజ‌య‌సాయిరెడ్డి కామెంట్స్ చేశారు. మ‌రి విజ‌య‌సాయిరెడ్డి వ్యాఖ్య‌ల‌పై టీడీపీ త‌మ్ముళ్ళు ఎలా స్పందిస్తారో చూడాలి.