Road Accident: ఏలూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఆంధ్రప్రదేశ్ లో మహాశివరాత్రి రోజు విషాదం నెలకొంది. ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. పూళ్ల దగ్గర ఆగి ఉన్న బైకులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.

  • Written By:
  • Publish Date - February 18, 2023 / 02:53 PM IST

ఆంధ్రప్రదేశ్ లో మహాశివరాత్రి రోజు విషాదం నెలకొంది. ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. పూళ్ల దగ్గర ఆగి ఉన్న బైకులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. ఆ యువకుడి పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం. ఆర్టీసీ బస్సు వేగంగా దూసుకొచ్చిందని స్థానికులు చెప్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: Mirzapur Actor Died: మిర్జాపూర్ నటుడు షానవాజ్ మృతి