Site icon HashtagU Telugu

Road Accident: ఏలూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

Mexico Bus Crash

Road accident

ఆంధ్రప్రదేశ్ లో మహాశివరాత్రి రోజు విషాదం నెలకొంది. ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. పూళ్ల దగ్గర ఆగి ఉన్న బైకులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. ఆ యువకుడి పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం. ఆర్టీసీ బస్సు వేగంగా దూసుకొచ్చిందని స్థానికులు చెప్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: Mirzapur Actor Died: మిర్జాపూర్ నటుడు షానవాజ్ మృతి