Road Accident: ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. నంద్యాల జిల్లా డోన్‌లో ఐచర్ వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

  • Written By:
  • Publish Date - January 15, 2023 / 10:46 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. నంద్యాల జిల్లా డోన్‌లో ఐచర్ వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌‌మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతులను కృష్ణ, సందీప్, రామకృష్ణగా పోలీసులు గుర్తించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Also Read: Old Woman Rape: 90 ఏళ్ల వృద్దురాలిపై లైంగిక దాడి.. లిఫ్ట్ ఇస్తానని బైక్ ఎక్కించుకుని