Dhar Robbery Gang : తెలుగు రాష్ట్రాల్లో ‘ధార్‌’ దొంగలు.. ఈ ముఠా చిట్టా ఇదీ

‘ధార్‌’(Dhar Robbery Gang) అనేది మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఒక గిరిజన ప్రాంతం.

Published By: HashtagU Telugu Desk
Dhar Robbery Gangs Thefts Terror Anantapur Hyderabad

Dhar Robbery Gang : ధార్ దొంగల గ్యాంగ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో యాక్టివేట్ అయింది. వేసవి కాలం పూర్తయ్యే వరకు ఈ గ్యాంగ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఉండే అవకాశం ఉంది. ప్రత్యేకించి జాతీయ రహదారులకు పక్కన ఉండేే గ్రామాలను ఈ ముఠా టార్గెట్‌గా ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా కేంద్రంగా ధార్ దొంగలు తెలుగు రాష్ట్రాల్లో  దొంగతనాలకు స్కెచ్‌లు గీస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని వారాలుగా ఈ ముఠా ఏపీలోని అనంతపురం జిల్లాలో యాక్టివిటీ నిర్వహించింది. ఈ గ్యాంగ్‌లోని కొందరిని ఇటీవలే అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకీ ఈ ముఠా ఎక్కడిది ? దొంగతనాలు ఎలా చేస్తుంది ?

Also Read :Delhi CM : ఢిల్లీకి మహిళా సీఎం.. రేసులో ఉన్నది వీరే

‘ధార్‌’ ముఠా ఎక్కడిది ? దొంగతనాలు ఎలా చేస్తుంది ?

  • ‘ధార్‌’(Dhar Robbery Gang) అనేది మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఒక గిరిజన ప్రాంతం. ఇక్కడి మారుమూల గ్రామాలకు చెందిన కొన్ని కుటుంబాలు దరు దొంగతనాన్నే ప్రొఫెషన్‌గా ఎంచుకుంటారు.
  • వీరు ఏడాదిలో దాదాపు 8 నెలలు  వ్యవసాయ కూలీలుగా పనిచేస్తుంటారు.
  • కేవలం మూడు నుంచి నెలలుగా దొంగతనాల కోసం తెగబడుతుంటారు.
  • పోలీసులు మధ్యప్రదేశ్‌లోని ధర్  ప్రాంతంలో ఉన్న దొంగలను పట్టుకోవడానికి వెళితే.. ఆయా గ్రామాలు ఏకమై దాడులు చేయడానికీ వెనుకాడవు.  అందుకే ధార్ దొంగలను పట్టుకోవాలంటే పోలీసులు వెనుకడుగు వేస్తుంటారు.
  • చోరీ చేసే సమయంలో ఎవరైనా అడ్డొస్తే ప్రాణాలు తీసేందుకు ధార్ ముఠా దొంగలు వెనుకాడరు.
  • ధార్ గ్యాంగ్ సభ్యులు ఒంటరిగా దొంగతనాలకు వెళ్లరు. కనీసం  ముగ్గురు ఉండేలా టీమ్ ఏర్పాటు చేసుకొని దొంగతనానికి వెళ్తారు.
  • దొంగతనాలు చేసి రైళ్లు, బస్సులు, టూవీలర్స్‌ ద్వారా వేరే ఏరియాలకు పరార్ అవుతారు.
  • తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకుంటారు.
  • ఏదైనా ఇంటిని/దుకాణాన్ని టార్గెట్‌గా చేసుకుంటే, ముందుగా పగలంతా రెక్కీ చేస్తారు. రాత్రి టైంలో తమ గ్యాంగ్‌తో చోరీచేస్తారు.
  • ధార్ గ్యాంగ్‌లోని వాళ్లకు  చిన్న వయసులోనే పెళ్లిళ్లు అవుతాయి. వీరికి చాలా వ్యసనాలు ఉంటాయి. వాటిని తీర్చుకోవడానికి డబ్బు అవసరం. ఈజీగా డబ్బును సంపాదించే ప్రయత్నంలోనే దొంగతనాలు చేస్తుంటారు.
  • చోరీలకు పాల్పడే ముందు పోలీసులకు దొరకకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.
  • ఈ దొంగలు సెల్ ఫోన్ వాడరు.
  • ముఖాలు కనిపించకుండా జాగ్రత్తపడుతారు.
  • ముసుగు వేసుకొని రాత్రి సమయాల్లో చోరీలు చేస్తారు.
  • ధార్ ముఠా దొంగలు తాము చోరీ చేసిన బంగారాన్ని ఎలాంటి తూకం వేయించకుండానే  అమ్మేస్తారు.  కొనుగోలు చేసేవారు ఎంత ఇచ్చినా తీసుకుంటారు.

Also Read :Bird Flu : బర్డ్ ఫ్లూ వల్లే కోళ్ల మరణాలు.. మాంసం, గుడ్లు తినొచ్చా ?

  Last Updated: 11 Feb 2025, 08:55 AM IST