YS Jagan Stone Attack: ఇటీవల విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన దాడి కేసులో వైఎస్సార్సీపీ ప్రభుత్వం, విజయవాడ పోలీసుల తీరుపై తెలుగుదేశం పార్టీ నేత పట్టాభిరామ్ మండిపడ్డారు. పట్టాభిరామ్ దాడి ఘటనను డ్రామాగా అభివర్ణిస్తూ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అనే మైనర్ బాలుడిపై కేసు నమోదు చేశారని ఆరోపించారు. తనపై గులకరాళ్లు వేయించుకుని ప్రజల్లో సానుభూతి పొంది నాలుగు ఓట్లు సంపాదించుకోవాలని జగన్ భావిస్తున్నాడు. అయితే జగన్ తీరుని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు పట్టాభిరామ్. 2019 ఎన్నికలకు ముందు కోడికత్తి డ్రామా, 2014 ఎన్నికలకు ముందు గులకరాయి డ్రామా ఆడుతున్నాడని విమర్శించారు. అప్పుడు భుజానికి ప్లాస్టర్ వేసుకున్నాడని, ఇప్పుడేమో నుదుటికి ప్లాస్టర్ వేసుకుని ఫోటోలకు ఫోజులిస్తున్నాడని సీఎం జగన్ పై సెటైర్లు పేల్చారు పట్టాభిరామ్.
సతీష్ను బలిపశువుగా మార్చారని, పోలీసులు తప్పుడు కేసులు బనాయించారని, రాబోయే రోజుల్లో కోర్టుకు సమాధానం చెప్పాలని హెచ్చరించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోండా ఉమపై కేసులు బనాయించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాళ్ల దాడిని డ్రామాగా పేర్కొంటూ టీడీపీ నేతపై కేసులు బనాయించడం దారుణమన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ తప్పుడు వ్యూహాలకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెల్లంపల్లి శ్రీనివాస్ను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, ఈ కేసులో పోలీసులు వారి చర్యలకు సమాధానం చెప్పాలని అన్నారు.
We’re now on WhatsApp. Click to Join
కాగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై జరిగిన రాళ్ల దాడిపై జరుగుతున్న విచారణలో, ప్రభుత్వం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని టీడీపీ నేత, విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బోండా ఉమ ఆరోపించారు. రాళ్ల దాడి కేసులో తనను అరెస్టు చేసేందుకు నిన్న 100 మంది పోలీసులు నా కార్యాలయాన్ని చుట్టుముట్టారని అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సిగ్గుతో తల దించుకోవాలని.. తప్పుడు బర్త్ సర్టిఫికెట్తో మైనర్ను ఇరికించారని.. ఈ కేసులో నిందితుడు దుర్గారావును 24 గంటల్లోగా న్యాయమూర్తి ముందు ఎందుకు హాజరుపరచలేదని సూటిగా ప్రశ్నించారు.
Also Read: Pooja Hegde : దేవర ఐటం సాంగ్ తో ఊపు ఊపేందుకు సిద్ధమైన అమ్మడు..!