TDP- Janasena Joint Manifesto Committee : ఆరుగురు సభ్యులతో టీడీపీ -జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ

ఈ కమిటీలో టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు కొమ్మారెడ్డి పట్టాభిరామ్.. జనసేన పార్టీ తరఫున వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ సభ్యులుగా ఉంటారు

  • Written By:
  • Publish Date - November 11, 2023 / 09:00 PM IST

ఆరుగురు సభ్యులతో టీడీపీ -జనసేన ఉమ్మడి మేనిఫెస్టో (TDP-Janasena Manifesto) కమిటీ ఏర్పాటైంది. ఏపీలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసి బరిలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇరు పార్టీలు కలిసే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. తాజాగా ఆరుగురు సభ్యులతో టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో (Manifesto) కమిటీ ఏర్పాటు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ కమిటీలో టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు(Ashok Babu), కొమ్మారెడ్డి పట్టాభిరామ్.. జనసేన పార్టీ తరఫున వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ సభ్యులుగా ఉంటారు. ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ రూపకల్పనపై ఈ కమిటీ నవంబరు 13న సమావేశం కానుంది. టీడీపీ ఇప్పటికే సూపర్ సిక్స్ పాయింట్ మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్లింది. పొత్తు అనంతరం పవన్ కల్యాణ్ ‘షణ్ముఖ వ్యూహం’ పేరిట మరో 6 అంశాలు ప్రతిపాదించారు. ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ పవన్ ప్రతిపాదనలను కూడా పరిగణనలోకి తీసుకుని తాజా మేనిఫెస్టోకు రూపకల్పన చేయనుంది.

Read Also : Manda Krishna Madiga : మోడీని పట్టుకొని కన్నీరు పెట్టుకున్న మందకృష్ణ