తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఎక్కుడున్నాడు? హైద్రాబాద్ లోనా? అమరావతిలోనా? అనే ప్రశ్న టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన కోటరీలోని కొందరికి మాత్రమే చంద్రబాబు కదలికల గురించి తెలుసు. సాధారణంగా చంద్రబాబు కార్యక్రమాల షెడ్యూల్ ను టీడీపీ ఆఫీస్ మీడియాకు ఇవ్వడం ఆనవాయితీ. ముందు రోజే ఆయన టూర్ షెడ్యూల్ ను మీడియాకు అందించే సంప్రదాయం ఉంది. ఆ మేరకు మీడియా అప్రమత్తం కావడంతో పాటు కవరేజి కోసం ఏర్పాట్లు చేస్తుంది. కానీ, వారం రోజులుగా ఆయన షెడ్యూల్ మీడియాకు తెలియడంలేదు. ఎక్కడకు వెళ్లారో..కూడా అంతుబట్టకుండా ఉంది.
సాధారణంగా హైద్రాబాద్ లేక అమరావతిలో ఉంటే ప్రతి రోజూ ఏదో ఒక అంశంపై స్పందిస్తాడు. నిత్యం ప్రజల సమస్యలపై అధ్యయనం చేయడం ఆయనకు అలవాటు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై గళం విప్పుతుంటాడు. క్రిస్మస్ కు ముందు నుంచి ఆయన మీడియాకు దూరంగా ఉన్నారు. ఏపీ సీఎం జిల్లాలకు వెళ్లిన సందర్భంగా ఓటీఎస్ పై పలు విధాలుగా మాట్లాడాడు. ఓటీఎస్ విషయంలో టీడీపీ చేస్తోన్న ప్రచారంపై మండిపడ్డాడు. అయినప్పటికీ చంద్రబాబు మీడియాకు రాలేదంటే ఆయన ఊర్లో లేడని కొందరు భావిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా `రెక్కీ` అంశంపై స్పందించాడు. ఫోన్లో రాధాతో మాట్లాడాడు. ఏపీ డీజీపీకి లేఖ రాశాడు. అంతకు మినహా వారం రోజులుగా చంద్రబాబు సైలెంట్ గా ఉన్నారంటే లోకల్ గా లేడని పార్టీ వర్గాల టాక్.
ప్రతి ఏడాది విదేశీ టూర్లకు వెళ్లడం గత కొంత కాలంగా చంద్రబాబు అలవాటు చేసుకున్నాడు. వ్యక్తిగత టూర్ కు వెళ్లిన సందర్భాల్లోనూ అనధికారికంగా మీడియాకు లీక్ రావడం సహజం. కానీ, ఈసారి మాత్రం ఎలాంటి లీకులు లేకుండా సైలెంట్ గా చంద్రబాబు విదేశీ టూర్కు ఫ్యామిలీతో వెళ్లాడని పార్టీ వర్గాల టాక్. ఆయనకు దగ్గరగా ఉండే మీడియాలోనూ బాబు విదేశీ టూర్ గురించి రాలేదు. సోషల్ మీడియాలోనూ పెద్దగా ఎక్కడా ఆ వార్త కనిపించలేదు. పార్టీలోని కొన్ని వర్గాలు మాత్రం చంద్రబాబు టూర్ కు వెళ్లాడని చెబుతున్నాయి. ఏ దేశానికి వెళ్లాడు? ఎన్ని రోజులు అనేది మాత్రం రహస్యంగానే ఉంది. ప్రత్యర్థులు మాత్రం దుబాయ్ వెళ్లి ఉంటారని గుసగుస లాడుతున్నారు. ప్రతిపక్ష నాయకునిగా ఉన్న చంద్రబాబు విదేశీ టూర్ ను ఎందుకు రహస్యంగా దాచాడని కొందరు ఇప్పుడిప్పుడే గళం విప్పడానికి ప్రత్యర్థులు రెడీ అవుతున్నారు.
గతానికి భిన్నంగా చంద్రబాబు జీవన శైలి ప్రస్తుతం ఉంది. నిత్యం పాలనలో బీజీగా ఉండే చంద్రబాబు కుటుంబాన్ని, బంధువుల్ని, స్నేహితులను పెద్దగా పట్టించుకోడు. రాష్ట్రాభివృద్ధి గురించి ఎడతెగని మీటింగ్ లు పెట్టడం ఆయనకు అలవాటు. అందుకే ఆయన్ను పని రాక్షసుడిగా కొందరు ఐఏఎస్ లు పిలుచుకునే వాళ్లు. పాలన హడావుడిలో పడి వ్యక్తిగత జీవితాన్ని చాలా కోల్పోయాడు. ఆ విషయాన్ని ఇటీవల తెలుసుకున్నాడని ఆయన అనుచరులు చెబుతుంటారు. అందుకే, ఇటీవల కాలంలో ప్రతి ఏడాది కుటుంబంతో కలిసి విదేశీ టూర్ కు వెళుతున్నాడట. ఆ క్రమంలోనే ఈసారి కూడా ఆయన ఫ్యామిలీ టూర్ ఎంజాయ్ చేస్తున్నారని టాక్. కొత్త సంవత్సంలో సరికొత్త ఊత్సాహంతో ఆయన టూర్ ముగించుకుని వస్తాడని పార్టీ అంతర్గత వర్గాల సమాచారం. సో..చంద్రబాబు విదేశీ టూర్ లో ఫుల్ జోష్ లో ఉన్నారన్నమాట.