CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు దర్యాప్తులో జాప్యంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది మరియు ఆలస్యానికి గల కారణాలను వివరిస్తూ నాలుగు వారాల్లోగా అఫిడవిట్ను సమర్పించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)ని ఆదేశించింది. ఈ వ్యవహారంపై త్వరితగతిన విచారణ జరగాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన కోర్టు.. వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించింది.
We’re now on WhatsApp. Click to Join.
జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం దర్యాప్తు ప్రక్రియను వేగవంతం చేయడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఆదేశాలు జారీ చేసింది. విచారణలో జాప్యానికి డిశ్చార్జి పిటిషన్లు కారణమవుతున్నాయని సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టుకు తెలిపారు. రాజకీయ కోణంలో విచారణను వాయిదా వేయరాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి సహా రాజకీయ నేతల ప్రభావంతో దర్యాప్తును అడ్డుకోవద్దని జస్టిస్ సంజీవ్ ఖన్నా ఉద్ఘాటించారు. బెయిల్ రద్దు, తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ పిటిషన్లను విచారణలో భాగంగా పరిష్కరిస్తామని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఆగస్టు 5 తర్వాత వారానికి వాయిదా వేసింది.
Also Read: Dry Coconut Benefits: ఎండు కొబ్బరి వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?