ఏపీలో అసెంబ్లీ ఎన్నికల (AP Elections) పోలింగ్ డేట్ రావడం తో అక్కడి రాజకీయాలు రోజు రోజుకు మరింత వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా పిఠాపురం (Pithapuram) అసెంబ్లీ పైనే అందరి దృష్టి..ఎందుకంటే ఈ స్థానం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలోకి దిగడమే. ఎలాగైనా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను ఓడించడమే లక్ష్యం గా పెట్టుకున్న అధికార పార్ట్ వైసీపీ (YCP)..పవన్ కు పోటీగా అదే సామాజిక వర్గానికి చెందిన వంగా గీత ను బరిలోకి దింపింది. అలాగే ఈ నియోజకవర్గంలో మెజార్టీ కాపుల ఓట్లే ఉండడం తో కాపు నేతలను వైసీపీ లోకి తీసుకొని ఓ తన బలం పెంచుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఇప్పుడు సిట్టింగ్ మ్మెల్యే పెండెం దొరబాబు (Dorababu Pendem) సైతం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ అభ్యర్థి వంగా గీతను గెలిపించుకొని సీఎం జగన్ వద్దకు వస్తానని తాజాగా చెప్పుకొచ్చారు. సీఎంతో సమావేశం తర్వాత ఆయన మాట్లాడుతూ.. ‘పొత్తులతో టీడీపీ-బీజేపీ-జనసేన ఎన్ని కుట్రలు చేసినా ప్రజల గుండెల్లో జగన్ బొమ్మను చెరపడం ఎవరికీ సాధ్యం కాదు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలూ వైసీపీనే గెలుచుకుంటుంది’ అని జోస్యం తెలిపారు. ఏది ఏమైనప్పటికి ప్రస్తుతం పిఠాపురంలో విజయం ఎవర్ని వరిస్తుందనేది అంత మాట్లాడుకుంటున్నారు. టీడీపీ సైతం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను లక్ష మెజార్టీ తో గెలిపించుకుంటామని చెపుతున్నప్పటికీ..అక్కడి టీడీపీ నేతకు టికెట్ ఇవ్వలేదనే కోపం తో టీడీపీ శ్రేణులు ఉన్నారు. మరి పోలింగ్ సమయానికి శాంతించి పవన్ కు జై కొడతారా లేదా అనేది చూడాలి. ఈ నెల 27 నుండి పవన్ పిఠాపురంలో పర్యటించబోతున్నారు.
Read Also : MLC Kavitha : నేడు సుప్రీంకోర్టులో కవిత పిటిషన్పై విచారణ