Site icon HashtagU Telugu

Mithun Reddy : ఏపీ లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి పాత్ర.. కీలక వివరాలివీ

Ap Liquor Scam Mithun Reddy Midhun Reddy Ysrcp Sit Andhra Pradesh

Mithun Reddy : వైఎస్సార్ సీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన లిక్కర్ స్కాంపై ప్రత్యేక దర్యాప్తు టీమ్ (సిట్) విచారణ వేగంగా జరుగుతోంది. ఈ స్కాంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పాత్రకు సంబంధించిన కీలక సమాచారాన్ని సిట్ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది.  ఓ వైపు ముడుపుల వసూళ్లు.. మరోవైపు సొంత బ్రాండ్ల మద్యానికి ఎక్కువగా ఆర్డర్లు ఇచ్చుకోవటం ద్వారా మిథున్‌రెడ్డి రెండు విధాలుగా అనుచిత లబ్ధి పొందారని సిట్‌ గుర్తించింది. లిక్కర్ డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి ముడుపుల వసూళ్ల కోసం రాజ్‌ కెసిరెడ్డితో కలిసి హవాలా నెట్‌వర్క్‌‌ను తయారు చేయడంలో, వసూలు చేసిన ముడుపుల్ని  ఆనాటి ప్రభుత్వ పెద్దలకు చేర్చటంలో మిథున్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్‌  తేల్చింది. అందుకే ఈ స్కాంలో మిథున్ రెడ్డిని ఏ4గా చేర్చింది. ఈ వ్యవహారంలో ఇప్పటిదాకా అరెస్టయిన నిందితుల రిమాండు రిపోర్టుల్లో, మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేయాలంటూ సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్‌లోనూ ఈ అంశాలను సిట్‌ ప్రస్తావించింది.

Also Read :Pakistan Vs IndiGo : ‘ఇండిగో‌’పై పాక్ నిర్దయ.. 227 మంది ప్రాణాలతో చెలగాటం.. ఏమైందంటే ?

మిథున్‌రెడ్డి‌పై సిట్‌ అభియోగాలివీ.. 

Also Read :Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు