Site icon HashtagU Telugu

YS Vijayamma Resigns : ప్లీన‌రీ వేదిక‌గా అమ్మ‌ రాజీనామా

YS Vijayamma Open Letter

YS Vijayamma Open Letter

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ వేదిక‌గా గౌర‌వాధ్య‌క్షురాలి ప‌ద‌వికి వైఎస్ విజ‌య‌మ్మ రాజీనామా చేశారు. ఇక నుంచి తెలంగాణ వైఎస్సార్ పార్టీ మాత్ర‌మే ప‌నిచేస్తాన‌ని ప్ర‌క‌టించారు. రెండు పార్టీల‌కు ప‌నిచేయ‌డాన్ని ప్ర‌జ‌లు అంగీక‌రించిన‌ప్ప‌టికీ కొంద‌రు విమ‌ర్శించే వాళ్ల‌కు అవకాశం ఇవ్వ‌కుండా రాజీనామా చేస్తున్న‌ట్టు ఆమె ప్ర‌క‌టించారు. ఏపీ, తెలంగాణ ప్ర‌యోజ‌నాల కోసం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, ష‌ర్మిల భిన్న విధానాలు ఎంచుకోవాల్సి వ‌స్తోంది. ఆ క్ర‌మంలో రెండు పార్టీల‌కు పనిచేయ‌డాన్ని కొంద‌రు విమ‌ర్శించ‌డానికి అవ‌కాశం ఉంద‌ని ఆమె చెప్పారు. కుటుంబంలో వివాదాలు ఉన్నాయ‌ని చిల‌వ‌లుప‌లువ‌లుగా చేస్తోన్న ప్ర‌చారాన్ని ఖండించారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిని ఇరు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌ల గుండెల్లో ఉన్నారని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఏపీలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆయ‌న తండ్రి బాట‌న న‌డుస్తూ మ‌న‌సున్న ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్నార‌ని కితాబు ఇచ్చారు. రాజ‌న్న రాజ్యం కోసం పోరాడుతోన్న ష‌ర్మిలతో ఇక నుంచి న‌డ‌వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు విజ‌య‌మ్మ ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

సుమారు 40 నిమిషాల‌పాటు సాగిన విజ‌యమ్మ ప్ర‌సంగంలో 30 నిమిషాల పాటు కుటుంబం గురించి చెప్పుకొచ్చారు. వైఎస్ లెగ‌సీ ని ఏ విధంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కొన‌సాగిస్తున్నారో చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. వైఎస్ఆర్ మ‌ర‌ణం తరువాత కుటుంబం ప‌డిన బాధ‌ల‌ను గుర్తు చేస్తూ ప్ర‌సంగాన్ని కొన‌సాగించారు. ప్లీన‌రీకి వ‌చ్చిన ప్ర‌తి మ‌నిషిలోనూ వైఎస్ఆర్ ను చూస్తున్నానంటూ అంద‌రికీ `హాపీ బ‌ర్త్ డే ` అంటూ సంభోదించ‌డం ఆక‌ట్టుకుంది. ఇక జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌డిన క‌ష్టాలు, ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ పాల‌న గురించి మాట్లాడుతూ పిల్ల‌లు ఇద్ద‌రికీ న్యాయం చేయాల‌నే ఉద్దేశంతో రాజీనామా చేస్తున్నానంటూ ప్ర‌క‌టించారు. ఆమె ప్ర‌సంగంలోని ముఖ్యాంశాలు ఇవి.

*షర్మిలమ్మ తెలంగాణ కోడలుగా..వైఎస్ఆర్ కూతురుగా..వైఎస్ఆర్ టీపీ పెట్టింది.తన వంతుగా తెలంగాణలో ఆమె ప్రయత్నం చేస్తుంది.

*ఎల్లో మీడియాలో ఏదిబడితే అది రాస్తున్నారు. ఎల్లో మీడియా అబద్ధాలు రాయడం దురదృష్టకం. ఇద్దరి పిల్లలకు తల్లినే..తెలుగువాడు గుండెచప్పుడు వైఎస్ఆర్

*ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు…ఇకపై జరగబోయేది ఒక ఎత్తు ఏపీలో కంటే కూడా..తెలంగాణలో ముందుగానే ఎన్నికలు వస్తాయి.

*ఏపీ భవిష్యత్తు ప్రయోజనాల కోసం సీఎం జగన్‌కు కచ్చితంగా స్టాండ్ ఉంటుంది. తెలంగాణలో షర్మిలకు వేరువేరు విధానాలు ఉంటాయి. వైఎస్‌ఆర్ ఆశయాలు పునికిపుచ్చుకున్నవారు జగన్, షర్మిల.

*నేను రాయని, చేయని సంతకంతో..రాజీనామా లేఖ విడుదల చేశారు. ఇవి జుగుప్సకర రాతలు . ఆ లేఖ చూసినప్పుడు చాలా బాధ వేసింది. నేను రాయని, నేను చేయని సంతకం ఉన్న లేఖను ఎలా రిలీజ్ చేస్తారు.

*నేను వైఎస్ఆర్‌ సీపీ నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నా. అక్కడ షర్మిలకు అండగా ఉండాలని అనుకుంటున్నాను. నన్ను క్షమించమని వైఎస్ఆర్ అభిమానులను కోరుతున్నాను

*రాజకీయం అంటే దుష్ప్రచారాలు, వెన్నుపోట్లు కాదు. వైఎస్ఆర్ లేని లోటును నాకు ఎవరూ తీర్చలేరు.

*ప్లీనరీలో వైఎస్ విజయమ్మ ` నా జీవితంలో ప్రతి మలుపు ప్రజాజీవితాలతో ముడి పడి ఉంది అని వైఎస్ఆర్ చెబుతుండేవారు` అని చెప్పిన మాట‌లు గుర్తు చేశారు.

*రాజశేఖర్ రెడ్డి నా వాడే కాదు..మీ అందరీ వాడు. మీ అందర్నీ అభినందించడానికి, ఆశీర్వదించడానికి వచ్చాను

*రాజకీయ పార్టీలు అధికారం కోసం పుడతాయి.. వైఎస్‌ఆర్‌ సీపీ నల్ల కాలువ దగ్గర ఇచ్చిన మాట కోసం పుట్టింది

*వైఎస్ఆర్ లేడని తెలిసి 700 మంది ప్రాణాలు వదిలారు. కోట్లాది మంది అభిమానం నుంచి వైఎస్ఆర్ సీపీ పుట్టింది

*దేశంలోని వ్యవస్థలు అన్నీ దాడి చేసినా..మనం చేస్తున్నది న్యాయం, ధర్మం అని..కష్టాలు బాట ముందని తెలిసినా కూడా కన్నీళ్లను తుడవటానికి వైఎస్ఆర్ సీపీ పుట్టింది

*ఎన్నో కష్టాలను , నిందలను ఎదుర్కొని వైఎస్ఆర్‌ కుటుంబం నిలిచింది. అధికార శక్తులన్నీ జగన్‌ పై విరుచుకుపడ్డ బెదరలేదు. ఎన్నో విలువలు, మానవత్వంతో వైఎస్ఆర్‌ సీపీ పురుడు పోసుకుంది

*నిజాయితీగా ఆలోచన చేసే వ్యక్తిత్వం జగన్ ది. లక్షా 60వేల కోట్లు ప్రజలకు ప్రత్యక్షంగా వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అందించింది

*గడపగడపకు ఎమ్మెల్యేలను పంపుతున్నాడంటే..తాను మంచి చేశానని నమ్మడం వల్లనే పంపుతున్నాడు. నాడు – నేడు తో బడుల రూపురేఖలు మారిపోతున్నాయి

*మానవత్వంతో, మనసుతో చేసే పాలన జగన్ ఓర్పు, సహనంతో ఎంతో ఎత్తుకు దిగారు. పరిపాలనలో జగన్ విప్లవం తెచ్చారు. జగన్‌ చెప్పినవే కాకుండా…చెప్పనవి కూడా చేస్తున్నారు

*రాష్ట్రంలో పేద తల్లులు, పేద తండ్రులు మీ బిడ్డలను జగన్ చేతిలో పెట్టండి…జగన్ మీ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. పేద బిడ్డల భవిష్యత్‌ను జగన్ చూసుకుంటారు

*రైతుల కలలను జగన్ నెరవేరుస్తాడు. అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. వైఎస్ జగన్ మాస్ లీడర్‌

*దుర్గ ఫ్లైఓవర్‌ను చంద్రబాబు ఐదేళ్లో పూర్తి చేయలేకపోయారు. జగన్ సీఎం అయ్యాక పూర్తి చేశారు. జగన్‌ యువతకు రోల్ మోడ‌ల్‌. అందరి ప్రేమను పొందిన జగన్‌ను గర్వపడుతున్నా

*కడప ప్రజలు మొదటి నాతో ఉన్నందకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఉమ్మడి రాష్ట్రం వైఎస్ఆర్‌ను మహామనిషిని, మహర్షిని చేసింది. రాజశేఖర్ రెడ్డిగారు ఉన్నప్పుడు నిత్యం ఏం చేయాలి..ఏం చేయాలని ఆలోచించేవారు

*వైఎస్ఆర్‌ అంటే ప్రజలకు ప్రాణాలు పోయేంత ప్రేమ. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పరిపాలనలో సీఎం జగన్ విప్లవం తెచ్చారు. ప్రజలకు, వైఎస్ కుటుంబానికి 45 ఏళ్లు. ఇకపై కూడా నా అనుబంధం కొనసాగాలి. జగన్‌ మనసుతో చేసే పాలన నా కళ్లారా చూస్తున్నా