AP Election Results : ఏపీ ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ..

మరికొన్ని గంటల్లో రాష్ట్రంలో ఏ పార్టీ విజయం సాదించబోతుంది..? ఎవరు అధికారం దక్కించుకోబోతున్నారు..? ఎవరు సీఎం కుర్చీలో కూర్చోబోతున్నారు..? ఎవరికీ ఎంత మెజార్టీ రాబోతుంది..?

  • Written By:
  • Publish Date - June 3, 2024 / 07:58 PM IST

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ ఎన్నికల ఫలితాల సమయం వచ్చేసింది. మరికొన్ని గంటల్లో రాష్ట్రంలో ఏ పార్టీ విజయం సాదించబోతుంది..? ఎవరు అధికారం దక్కించుకోబోతున్నారు..? ఎవరు సీఎం కుర్చీలో కూర్చోబోతున్నారు..? ఎవరికీ ఎంత మెజార్టీ రాబోతుంది..? ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది..? సైకిల్ జోరా…? ఫ్యాన్ గాలి స్పీడా..? అనేది తెలియబోతుంది. దీనిపై తెలుగు రాష్ట్ర ప్రజల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది.

We’re now on WhatsApp. Click to Join.

ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు మే 13న ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లు భారీగా తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామాల్లో మహిళలు, పురుషులు, వృద్ధులే కాదు విదేశాల్లో ఉన్న NRI లు మండు ఎండలను సైతం లెక్క చేయకుండా వచ్చి ఓటు వేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా భారీగా పోలింగ్ శాతం నమోదు అయింది. దీంతో పోలింగ్ శాతం పెరగడం ఏ పార్టీకి కలిసొస్తుందో అనే ఆసక్తి నెలకొంది. మంగళవారం అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటలకే లెక్కింపు కార్యక్రమం ప్రారంభంకానుంది.

ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. అనంతరం ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్ల కౌంటింగ్ కొనసాగనుంది. ఉదయం 10 గంటలకు తొలి ఫలితం వెలువడనుంది. ఇప్పటికే ఎన్నికల కౌంటింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈసారి ఎగ్జిట్ పోల్స్ సైతం స్పష్టంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పలేకపోయాయి. కొన్ని సంస్థలు కూటమికి జై కొడితే..మరికొన్ని సంస్థలు వైసీపీ కి జై కొట్టాయి. ఈ నేపథ్యంలో గెలిచేదెవరు..? ఓడేదెవరు అనే ప్రశ్నలు విపరీతంగా వినిపిస్తున్నాయి. అటు ఆయా పార్టీలు మాత్రం తమకే అనుకూలమని చెప్పుకుంటున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Read Also : Ram Charan : ఈ నెలలో ఆ బహుమతి కోసం.. మెగా ఫ్యాన్స్ వెయిటింగ్.. చరణ్ ఇస్తాడా..?